- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మేకల దొంగతనం కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు

దిశ, మర్రిగూడ : 2018 నుండి వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ జిల్లా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన ముఠాను మర్రిగూడ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హాలియా మండలంలోని అలీనగర్ చెక్పోస్ట్ కు చెందిన సంపంగి వెంకటేష్, నిడమనూరుకు చెందిన దాసరల వినోదు, నర్సింగ్ బట్లకు చెందిన కనకాల బాలరాజు, కనగల్ కు చెందిన కురటి క్రాంతి నలుగురు ముఠా సభ్యులుగా ఏర్పడి 2018 నుండి వరుసగా మేకల దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగతనాలను సైతం ప్రొఫెషనల్ గా కారును
అద్దెకు తీసుకొని మేకలను దొంగలించడం వారికి ఆనవాయితీగా మారింది. మర్రిగూడ, నాంపల్లి, దేవరకొండ, నారాయణపురం, మునుగోడు ,చండూరు, రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలాల్లో మేకలను దొంగిలించారు. ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. ఈనెల రెండవ తేదీన శివన్నగూడెం గ్రామంలో ఒక ఇంటి నుండి మూడు మేకలను, అలాగే ఈనెల 7న రాత్రి సమయంలో శివన్నగూడెం గ్రామంలో రెండు మేకలను దొంగతనంగా కార్లో తీసుకుని వెళుతుండగా సీసీ ఫుటేజ్ లో నమోదైంది. సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా కారు నెంబరు ఆధారంగా నిందితులను 48 గంటల్లో ఎస్సై రంగారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. సరంపేట ఎక్స్ రోడ్ వద్ద శనివారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగతనానికి పాల్పడిన కారు లో ప్రయాణిస్తున్న
నిందితులు పోలీసులను చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమై ముగ్గురు నిందితులను వెంటనే అరెస్టు చేయగా క్రాంతి పరారీలో ఉన్నాడు. పోలీసుల విచారణలో నిందితులు 2018 నుండి జిల్లా వ్యాప్తంగా మేకల దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారని సీఐ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. 48 గంటల్లో మండలంలో జరిగిన రెండు వరుస దొంగతనాల నిందితులను పట్టుకున్న ఎస్సై రంగారెడ్డిని, పోలీస్ సిబ్బందిని సీఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శంకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది రవికుమార్, సత్యనారాయణ, అసేన్, శ్రీనివాస్, హోంగార్డులో వాయిద్, యాదగిరి పాల్గొన్నారు.