- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇది మీ ప్రభుత్వం.. మీరు తెచ్చుకున్న ప్రభుత్వం

దిశ, హుజూర్ నగర్: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక హుజూర్ నగర్ సీత రామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకం పునరుద్ధరణ పనులకు పాలకవీడు మండలంలోని మూసీ నదిపై బెట్టే తండా వద్ద రూ. 33.80 కోట్లతో నిర్మాణం చేయనున్న లిఫ్ట్ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ ఇది మీ ప్రభుత్వం.. మీరు తెచ్చుకున్న ప్రభుత్వం మీ అభీష్టం మేరకే ఈ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. నన్ను స్పీకర్ని చేసి సోనియా గాంధీ నా నోరు మూయించారని నేను చాలా మాస్ లీడర్ నని వ్యాఖ్యానించారు. కోదాడ, హుజుర్ నగర్ ప్రజలు చాలా అదృష్టవంతులని వీరికి పిల్లలు లేకున్నా మీరే వారి కుటుంబ సభ్యులులా మీ కోసం నిరంతరం కష్ట పడుతున్నారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు అప్పులు చేసి పోయారని అయిన 6 గ్యారెంటీ పథకాలను 100 రోజులలో అమలు చేశారని అన్నారు. ఈ ప్రాంతంలో ప్రజల అభీష్టనాలా మేరకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేనంత అభివృద్ధి చేసిందని ఆ గొప్పతనం మంత్రి ఉత్తమ్ కుమార్కే దక్కుతుందని అన్నారు. ఈ రెండు నియోజకవర్గాలలో చేసిన అభివృద్ధిని ఈ ప్రాంత ప్రజలు ఎన్నడు మరువరని అన్నారు. తుది దశలో ఉన్న ఈ కాలనీ ఆరు నెలల్లో పూర్తి చేసి నిరుపేదలకు అందించడం జరుగుతుందని రాష్ట్రంలో ఆదర్శ నియోజక వర్గంగా అందించనున్నారని అన్నారు.
గత ప్రభుత్వం ప్రజల ఆస్తులను దోచుకుంది.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరం లో తెలంగాణ ప్రజల ఆస్తులును దోచుకున్నారు. మేము పరిపాలకులం కాదు, మేము సేవకులం అన్నారు. ప్రజల యొక్క సమస్యలను చెప్పుకునే విధంగా మాది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందన్నారు. 70 రోజుల్లోనే, ఉచిత కరెంట్, మహిళలుకు రూ. 500 గ్యాస్ అమలు చేశామన్నారు. గత రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి దైవ సన్నిధిలో ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో రూ. 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో, పట్టణంలో అర్హులైన నిరుపేదలకు రూ. 17 లక్షల ఇండ్లను అందించగా బీఆర్ఎస్ పది సంవత్సరాల్లో 1 లక్ష 12 వేలు ఇండ్లు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారంలో రాగానే ముందుగా హుజూర్ నగర్ లో హౌసింగ్ కాలనీ పరిశీలించి తుది దశలో ఉన్న ఇండ్లకు సత్వరమే రూ. రూ. 74.80 కోట్లు మంజూరు చేయడం జరిగిందని , 7 నేలలో పూర్తి చేసి పేదలకు అందిస్తామని అన్నారు.
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను పేదలకు అందించనున్నామని , 2008 డీఎస్సీ చేసిన వారికి త్వరలో ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తదుపరి 90 రోజుల లోపు 31 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. త్వరలో తెల్ల రేషన్ కార్డు అమలు చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడక ముందే వర్షాలు పడక కరువు వచ్చిందని గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్లనే నీళ్లు ఇవ్వలేక పోయామని అన్నారు. కానీ ఇప్పుడు మా మీద తప్పు మోపుతున్నారని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటను అమలు చేస్తామని స్పష్టం చేశారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ పేర్లు చెప్పుకొని దోచుకున్నారని తెలిపారు. ధరణి ద్వారా కబ్జా చేసిన విలువైన భూముల లెక్కలను ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసం పడ్డ ఆరాటం.. అభివృద్ధి పై పెట్టలేదని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అర్హులైన అందరికీ అందిస్తామని, నిజాయితీ, నిబద్ధతతో పాలన అందిస్తున్నామని అన్నారు. ఈ నియోజక అభివృద్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు.
పదేళ్లుగా హుజుర్ నగర్ అభివృద్ధికి నోచుకోలేదు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలే నా బలం..అభివృద్ధే నా లక్ష్యమని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో లిఫ్ట్లు, రహదారులు, ఆసుపత్రులు, పరిశ్రమలు చేపట్టామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేదలకు అందించే కాలనీ నిర్మాణానికి ఎంతో కృషి చేయడం జరిగిందని ప్రభుత్వ మార్పుతో గత పది సంవత్సరాలలో పనులు చేపట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు. తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత పనులు ఆగిపోయాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరం లో వీటిని పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు రూ. 70 కోట్లతో ఇండ్లు పునః నిర్మాణం చేపట్టామన్నారు. హుజుర్ నగర్లో ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయిస్తానని తెలిపారు. ఈ ప్రభుత్వం రూ.74.80 కోట్లు మంజూరు చేసిందని త్వరలో 2160 సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు అందించి హుజూర్ నగర్ లో ఇండ్లు లేని వారు లేకుండా చూస్తామని అన్నారు. తెల్ల రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ త్వరలో అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పాలకవీడు మండలం కంచుకోటనని పేర్కొన్నారు. హుజుర్ నగర్ కోదాడ ఏ విధంగా అభివృద్ధికి కృషి చేస్తానో అదే విధంగా మిర్యాలగూడ అభివృద్ధి కూడా కృషి చేస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తిని లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు, ఇరిగేషన్ ఎస్సీ రమేష్, హుజూర్ నగర్ నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్లు, గెల్లి అర్చన, రవి, బచ్చలకూరి ప్రకాష్, హుజుర్ నగర్ పాలకవీడు ఎంపీపీలు, గూడెపు శ్రీనివాస్, భూక్య .గోపాల్ జడ్పీటీసీ మాలోతు బుజ్జి, మోతిలాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, హుజూర్ నగర్ పట్టణ పాలకవీడు మండల అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, ఎన్.వి సుబ్బారావు, నాయకులు బైరెడ్డి జితేందర్ రెడ్డి ,బెల్లంకొండ నరసింహారావు, తీగల శశి రెడ్డి, పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు.