- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఈ డాక్టర్ రూటే సపరేట్

దిశ, నేరేడుచర్ల : ప్రజలకు సేవలందించే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమయానికి హాస్పిటల్కు వచ్చి పేషెంట్లకు పరీక్షలు నిర్వహించి వచ్చే వారికి ఓపిగ్గా నెమ్మదిగా తన సమాధానం చెప్పి వారికి సరైన ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. కానీ వీటికి భిన్నంగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని పెంచికల్ దిన్న పీహెచ్సి డాక్టర్ సీతామహాలక్ష్మి తన రూటే సపరేట్గా వెళ్తుంది. వివాదాలకు కేరాఫ్ గా ఇటీవల పేరు నిలుస్తుంది.
రేపటి సంతకం కూడా ముందే పెట్టి వెళ్లిన డాక్టర్..
ఆగస్టు 15 సందర్భంగా ఆమె రిజిస్టర్ లో ముందే సంతకం చేసింది. అంతేకాకుండా అదే రిజిస్టర్లో మరో ఇద్దరి ఉద్యోగులకు ముందస్తుగానే ఆబ్సెంట్ వేసి మరో ఉద్యోగికి సీఎల్ వేసింది. ఇదే విషయం తెలిసిన రిపోర్టర్లు పరిశీలించగా ఆ సంతకం పెట్టి అప్పటికే ఆమె వెళ్లిపోయింది. కానీ రోగులు మాత్రం హాస్పిటల్ నిండా ఉన్నారు. ఇలా పేషెంట్లు ఉండగానే డాక్టర్ వెళ్లిపోవడం పట్ల స్థానిక ప్రజలు,
అక్కడికి వచ్చిన పేషెంట్లు ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఆమె హాస్పిటల్ కి ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు వెళ్తుందో.. ఎప్పుడు సెలవు పెడుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. హాస్పటల్ కు వచ్చిన ఏదో కాలయాపన చేస్తూ కింది సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుందని తెలుస్తుంది. ఇప్పటికైనా సరే డాక్టర్ను అందుబాటులో ఉంచి వైద్య సేవలు అందించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.
గతంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కూడా ఈ డాక్టర్ పై చర్చ..
ఇదే విషయమై గతంలో ఈ డాక్టర్ వలన హాస్పిటల్ కి చెడ్డ పేరు వస్తుందని ఆమె ప్రవర్తన మార్చుకోమని చెప్పండి లేదా ఆమె ప్లేస్ లో మరొక డాక్టర్ నైనా కేటాయించాలని పలు మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశాలలో అప్పటి ఎంపీటీసీ ఎల్లబోయిన లింగయ్య సభ దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని తెలుస్తుంది.
ఈ డాక్టర్ వద్దంటూ.. గతంలో ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది..
డాక్టర్ సీతామహాలక్ష్మి ప్రవర్తన పట్ల విసిగిపోయిన సిబ్బంది ఈ డాక్టర్ తమకు వద్దంటూ మాకు మరొక డాక్టర్ను కేటాయించాలని హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అంతా సంతకాలు చేసి గతంలోనే డీఎంహెచ్వో కోటాచలం కు పంపించినట్లు సమాచారం.
దీనిపై డీఎంహెచ్వో కోటాచలం విచారణ అధికారిగా డిప్యూటీ డీఎంహెచ్ చంద్రశేఖర్ తో విచారణ కూడా జరిపినట్టు తెలిసింది. ఇదే విషయమై కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తో పాటు డీఎం హెచ్ ఓ కోట చలం దృష్టికి రిపోర్టర్లు తీసుకు వెళ్లగా రిపోర్టర్ వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు పంపిస్తే వాటిని పరిశీలించి విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.