- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఈ పిల్లి నాది..కాదు నాది..పోలీస్ స్టేషన్ కు చేరిన వింత పంచాయితీ

దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో వింత సంఘటన చోటు చేసుకుంది. నల్లగొండకు చెందిన ఓ వ్యక్తిపై తన ఇంటి పక్కనే ఉంటున్న మహిళ కేసు పెట్టింది. మరి ఆ వ్యక్తిపై మహిళ కేసు ఎందుకో పెట్టిందో తెలుసుకుందాం. పుష్పాలత అనే మహిళ మూడు సంవత్సరాలుగా ఓ పిల్లిని పెంచింది. అది కాస్తా గత ఏడాది తప్పిపోయింది. అయితే అలాంటి లక్షణాలు తో పోలి ఉన్న పిల్లి వాళ్ళ పక్కింట్లో ఉండటంతో..ఆమె ఆ పిల్లి తనదే అని నల్లగొండ టూ టౌన్ లో ఫిర్యాదు చేసింది. ఇదే విషయమై పోలీసులు అది ఎవరి పిల్లి అని తేల్చలేకపోయారు. ఆమె తనదే అని తన పిల్లి తెలుపు రంగులో ఉండేది..అని దానికి బ్రోన్ కలర్ రంగు వేశారు అని తెలిపినట్లు సమాచారం. అయితే ఆ పిల్లి తనదే అని పక్కింటి వ్యక్తి కూడా గట్టిగా తెలిపాడు. అలాగే తన వద్ద సుమారు ఇంకా 5 పిల్లులు ఉన్నాయని తెలిపారు. ఇదే విషయమై టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ రావుల నాగరాజుని దిశ వివరణ అడుగగా..ఈ పిల్లి పంచాయతీ కేసులో మహిళ తన పిల్లికి రంగు వేశారని చెప్పడంతో.. ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపినట్లు తెలిపారు. సంబంధించిన పూర్తి వివరాలు రాగానే..పిల్లి ఎవరిది అనేది తెలుస్తుందని తెలిపారు.