మేడారం జాతరకు వెళ్లిన ఇంట్లో చోరీ చేసిన దొంగలు

by Mahesh |
మేడారం జాతరకు వెళ్లిన ఇంట్లో చోరీ చేసిన దొంగలు
X

దిశ, వలిగొండ: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన మండలంలోని గోకారం గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకారం గ్రామానికి చెందిన ఏర్వ రామచంద్రయ్య భార్య సుశీలతో కలిసి 17 తేదీ శనివారం మేడారం జాతరకు వెళ్లి బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపు తెరిచి ఉండడంతో ఆచర్యపోయి ఇంటి లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాను పగలగొట్టి బీరువాలో ఉన్న 4 తులాల బంగారు నగలు,17 తులాల వెండి పట్ట గొలుసులు అగంతకులు ఎత్తుకెళ్లి నట్లు గా గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం తో దొంగల ఆచూకీ కోసం తనిఖీ నిర్వహించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందారి లాల్ తెలిపారు.



Next Story

Most Viewed