రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది వీళ్లే :ఎమ్మెల్యే

by Naveena |
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది వీళ్లే :ఎమ్మెల్యే
X

దిశ,భూదాన్ పోచంపల్లి: గత పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని అత్తమ్మగూడెం, దోతిగూడెం, భీమనపల్లి, కనుముకుల గ్రామాలలో పర్యటించి మౌలిక వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందని,అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ఏకకాలంలో 22 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రైతు భరోసా అందిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు కళ్లెం రాఘవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్ ,జిల్లా నాయకులు తడక వెంకటేష్,తడక రమేష్, సామ మోహన్ రెడ్డి, కొట్టం కరుణాకర్ రెడ్డి, ఉప్పునూతల వెంకటేశ్ యాదవ్, బొబ్బల జితేందర్ రెడ్డి,గ్యార సందీప్,జింకల జయసూర్య తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed