- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డబ్బు రెట్టింపు చేస్తామని బురిడీ కొట్టించిన ఘనులు

దిశ, నల్గొండ: నల్లగొండ జిల్లాలో మాయమాటలు చెప్పి 33 లక్షలు ఒక వ్యక్తి నుంచి కొట్టేసిన ముఠా గుట్టు రట్టు అయినది అని జిల్లా ఎస్పీ.శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన చందన పల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ అయిన రామోజు రామాచారి బీహార్ రాష్ట్రానికి చెందిన రామ్ సురేష్ యాదవ్ తో ఇల్లు నిర్మించుకున్నాడు. అతనితో కొంత పరిచయం ఉండటం తో బీహార్ కు చెందిన వ్యక్తులు ఇతని వద్ద ఎలాగైనా డబ్బులు కొట్టేయాలని దుర్బుద్ధితో రామోజు రామాచారి కి మాయమాటలు చెప్పి నగదుని రెట్టింపు చేసే లిక్విడ్ తమ వద్ద ఉన్నట్లు బకెట్లో వేసి తన వద్ద ఉన్నరూ 6,500 రూపాయలను బకెట్లో వేసి అందులో నుండి రూ. 13,000 రూపాయలు రామాచారికి ఇచ్చారు.
దీంతో నమ్మకం కుదిరిన రామాచారికి ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకొస్తే వాటిని రెట్టింపు చేస్తామని తెలపడంతో తాను తన వద్ద ఉన్న అలాగే తమ బంధువుల వద్ద నుంచి అప్పు చేసి సుమారు ముప్పై మూడు లక్షల రూపాయలు నగదుని రెట్టింపు చేస్తామని ఒక్కో కట్టలో 3 లక్షల చొప్పున 11 కట్టలు ముప్పై మూడు లక్షల రూపాయలు తీసుకొని తన ఇంట్లోనే వాటికి సీల్ వేసి తమ వెంట తెచ్చుకున్న పేపర్ కట్టలకు సీల్ వేసి వాటిని నీటిలో ముంచి అతను ఇంటికి రోగి వస్తే మాట్లాడుతున్న సమయంలో తమ వద్ద ఉన్న నకిలీ పేపరు బండిల్ లలో మొదట చివర అసలు అయిన 500 రూపాయల నోట్లను అమర్చి వాటికి పూర్తిగా సీల్ వేసి అసలు కట్టలను వారి వెంట తెచ్చుకున్న బ్యాగ్ లలో వేసుకున్నారు.
ఈ కట్టలు మూడు గంటల తర్వాత తీసి వాటిని స్టవ్ మీద వేడి చేసి తీస్తే అసలుగా మారుతాయి అని తెలిపి మేము హైదరాబాద్ కి వెళ్లి ఇంకా కొన్ని సీల్స్ అలాగే లిక్విడ్ కొనుగోలు చేసి తీసుకొని వస్తాం అని అన్నారు. వాళ్ళు వెళ్లిన తరువాత అసలు నిజం తెలుసుకున్న రామాచారి పోలీసులను ఆశ్రయించారు.కేసు నమోదు చేసుకొని ఎస్పీ ఉత్తర్వులు మేరకు నల్గొండ ఎస్ ఐ శివకుమార్ ,కానిస్టేబుల్ లు జానకి రాములు, తిరుమలేష్,హోం గార్డు సలీంలు టీం లు గా ఏర్పడి నేరస్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేస్తుండగా నల్లగొండ రైల్వే స్టేషన్ లో బీహార్ కి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 24 లక్షల నగదు రూపాయలు తీసుకున్నారు. వీరితో ఇంకో వ్యక్తి అతను 9 లక్షలతో పరారీలో ఉన్నాడు. ఈ కేసును నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి సమక్షంలో నల్గొండ టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డేనియల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించినందుకు వారిని ఎస్పీ అభినందించారు.