- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉచితంగా విద్యుత్ పొందాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవే

దిశ, నాగార్జునసాగర్: నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ హిల్ కాలనీ, పైలాన్ కాలనీ పరిధిలో గృహ జ్యోతి పథకం అమలుకు ప్రతి గృహ వినియోగదారుడు తప్పని సరిగా విద్యుత్ మీటర్కు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ నంబర్లను అనుసంధానం చేయించుకోవాలని నాగార్జునసాగర్ ఏఈ కళ్యాణి తెలిపారు. గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్లు ఉచితంగా పొందాలంటే అనుసంధానం తప్పనిసరి అన్నారు. విద్యుత్ బిల్లు తీసే సమయంలో సిబ్బందికి ఆధార్, రేషన్ కార్డు నంబర్లను చూపి విద్యుత్ సర్వీస్ నంబర్కు అనుసంధానం చేయించుకోవాలని సూచించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలుచేసే ప్రోగ్రామ్ను చేపట్టాం. ఇందులో భాగంగా విద్యుత్ వినియోగదారులకు విన్నపం ఏమనగా.. రేపటి నుంచి మీ ఇంటికి కరెంటు బిల్లు తీసేందుకు వచ్చే మీటర్ రీడర్కు మీ రేషన్కార్డు, ఆధార్కార్డు నంబర్లతోపాటు మొబైల్ నంబర్ చెప్పాలి. ఇందుకు వినియోగదారులు సహకరించాలని మనవి చేస్తున్నామని ఏఈ తెలిపారు. ఈ విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.