జూన్ 8 వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదు : కలెక్టర్ దాసరి హరిచందన

by Kalyani |
జూన్ 8 వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదు : కలెక్టర్ దాసరి హరిచందన
X

దిశ, నల్గొండ : పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, అలాగే వరంగల్-ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ వంటి కారణాల వల్ల కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 8 వరకు నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధించినందున జూన్ 8 వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన స్పష్టం చేశారు. అందువల్ల జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రతి సోమవారం ఫిర్యాదులు సమర్పించేందుకు నల్గొండ జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed