- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ గ్రామంలో సభకు స్పందన కరువు...

దిశ, అనంతగిరి : రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకాలకు సంబంధించి మంగళవారం నుంచి జనవరి 24వ తారీఖు వరకు సంక్షేమ పథకాల పై గ్రామసభలను ప్రభుత్వం చేపట్టింది. మొదటిరోజు అనంతగిరి మండల కేంద్రంతో పాటు ఖానాపురం, వెంకట్రాంపురం, పాత గోల్ తండా, త్రిపురవరం గ్రామాలలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పేర్లను గ్రామసభలో చదివి వినిపించారు. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నా తమ పేర్లు ఎందుకు రాలేదని పలు గ్రామాల్లో ప్రజలు అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు కలగజేసుకుని ప్రజలకు నచ్చ చెప్పారు.
దీంతో మొదటి రోజు గ్రామసభలు ముగిశాయి. రెండవ రోజు అనంతగిరి మండల వ్యాప్తంగా గ్రామసభలు ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా గ్రామసభలలో అనేకమంది తమ సమస్యలను చెప్పుకునేందుకు, లిస్టులో పేరు రాని వాళ్ళు అధికారులను అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ మండల పరిధిలోని లక్కవరం గ్రామంలో మాత్రం తొమ్మిది గంటలకు ప్రారంభం కావలసిన గ్రామసభ అధికారులు లేటుగా రావడంతో ఉదయం 9.45 నిమిషాలకు ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా ప్రజలు గ్రామసభకు హాజరు కాలేదు. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఈ గ్రామంలో అసలు సమస్యలు లేవా.. సమస్యలు ఉన్నా గ్రామ సభకు వచ్చిన ఉపయోగం లేదనుకున్నారా...? అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రజల రాక కోసం అధికారులు వేచి చూస్తున్నారు.