కాంగ్రెస్ లో భగ్గుమన్న వర్గ పోరు.. ఇరువర్గాల మధ్య తోపులాట..

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ లో భగ్గుమన్న వర్గ పోరు.. ఇరువర్గాల మధ్య తోపులాట..
X

దిశ, మిర్యాలగూడ: మిర్యాలగూడ కాంగ్రెస్ లో వర్గ పోరు భగ్గుమన్నది. ఎల్ఐసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం ఎల్ఐసీ కార్యాలయం ఎదుట టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాకి పిలుపునిచ్చారు. ఇందుకోసం ఎల్ఐసీ భవనం ఎదుట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మా రెడ్డి వర్గీయులు టెంట్ ఏర్పాటు చేశారు. అయితే ధర్నాకి అనుమతి లేదని డీఎస్పీ హెచ్చరించగా సమావేశం పార్టీ ఆఫీస్ కి మార్చారు. కాగా జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ బీఎల్ఆర్ ఏర్పాటు చేసిన టెంట్ కింద తన అనుచరులతో కలిసి ధర్నా చేయడం వివాదం రేపింది.

విషయం తెలిసిన బీఎల్ఆర్ వర్గీయులు శంకర్ నాయక్ ని నీలదీయగా ఇరువర్గాల కార్యకర్తల నడుమ తోపులాట జరిగింది. జిల్లా అధ్యక్షుడు కార్యకర్తలను, నాయకులను కలుపుకుపోవడం లేదని ఆరోపిస్తూ ఇరువర్గాలు పరస్పరం వన్ టౌన్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. విషయం మాజీ మంత్రి జానా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఇరువర్గాలతో మాట్లాడుతానని పేర్కొన్నట్లు సమాచారం.


Next Story

Most Viewed