దాహం వేస్తుంది.. కాసిన్ని మంచి నీళ్లు ఇవ్వరా ప్లీజ్..

by Aamani |
దాహం వేస్తుంది.. కాసిన్ని మంచి నీళ్లు ఇవ్వరా ప్లీజ్..
X

దిశ,రాజపేట : అప్పుడే 40 డిగ్రీల పైబడి ఎండ వేయడంతో మనుషులకే తిప్పలు అవుతుంది. మరి పక్షుల మాటేమిటి.. వేసవి కాలం వచ్చేసింది. ఆహారం కోసం గూడు వదిలి ఎండలో ఎగురుతుంటే రెక్కలు అలసి నిరసం వచ్చేస్తుంది. దాహంతో గొంతు ఎండిపోతుంది పోయిన ఏడాది మా పక్షి జాతిలో ఎన్నో రకాల పక్షులు నీటి చుక్క దొరకక దాహంతో చనిపోయాయి అంట. అందుకే మిమ్మల్ని కాసిన్ని మంచినీళ్లు ఇచ్చి మా ప్రాణాలు కాపాడమని ప్రాధేయపడుతున్నాము. శ్రమ అనుకోకుండా మా కోసం కొన్ని మీ పిట్టగోడ పై కానీ, మీ డాబాపై గాని వీలైన ప్రదేశంలో కొంచెం మంచినీళ్లు ఏర్పాటు చేస్తే తాగి ప్రాణాలు నిలుపుకుంటాం.

పొద్దుటే మీకంటే ముందే నిద్రలేచి మీ కిటికీలోంచి మీ చెట్లపై నుంచి మా మా భాషలలో కిచకిచ, కూ కూ అని గుడ్ మార్నింగ్ లు కృతజ్ఞతలు చెబుతాం .. ప్లీజ్ మంచినీళ్లు పెట్టి మమ్మల్ని ఆదుకోరు. వీలైతే కాసిన్ని గింజలు కూడా. ఇట్లు మీ నేస్తాలు పావురం, పిచ్చుక, చిలుక, కోయిల, కాకి, గమనిక.. ఈ కాగితం చదివి చెత్త డబ్బాలో పడకుండా ఇంకొకరికి అందించగలరు. నెట్ ఇంట వైరల్ అవుతున్న పక్షుల దాహార్తిని తీర్చాలని కోరుతున్న ప్రజలు. ఫేస్‌బుక్, ఇన్‌ట్సావాట్సప్ స్టేటస్ లో షేర్ అవుతున్న పక్షి ప్రేమికుల చిత్రం.



Next Story

Most Viewed