- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మున్సిపాలిటీల్లో ప్రత్యేక పాలన..

దిశ, నల్లగొండ బ్యూరో : మున్సిపాలిటీల పాలకవర్గం గడువు నేటితో పూర్తవుతుంది. రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో మున్సిపాలిటీలు కొనసాగుతాయి. మన ఉమ్మడి జిల్లాలో 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, నల్గొండ జిల్లాలో చిట్యాల, నకిరేకల్, నల్గొండ, మిర్యాలగూడ, హాలియా, నాగార్జునసాగర్, చండూరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, పోచంపల్లి , చౌటుప్పల్, భువనగిరి మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఇందులో నూతనంగా గ్రామపంచాయతీ పాలకవర్గం అధికారులు ఉండగానే నూతనంగా మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. అయితే పాలకవర్గం గడువు పూర్తయిన తర్వాత అక్కడ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అందుకే నకరికల్లు దాదాపు మరో రెండు సంవత్సరాలు మున్సిపల్ పాలకవర్గం పనిచేస్తుంది. మిగతా వాటికి అన్నింటిలోనూ రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వస్తాయి. జిల్లా కేంద్రాలుగా ఉన్నటువంటి నల్లగొండ భువనగిరి, సూర్యాపేట, మున్సిపాలిటీలకు కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా ఉండే అవకాశం ఉంది. మిగతా వాటికి ఆర్డీవో స్థాయి అధికారులను నియమించే అవకాశం ఉంటుంది.
ఏడాదికాలంగా పంచాయతీలు..
దాదాపు ఏడాది కాలంగా గ్రామ పంచాయతీలు పూర్తిగా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. గత ఫిబ్రవరిలో సర్పంచ్ లు పదవీకాలం ముగిసింది. దాంతో మండల స్థాయి అధికారులు గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు. అయితే గ్రామపంచాయతీలలో పాలకవర్గం లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోతాయి అన్న విషయం తెలిసింది. దాంతో గ్రామపంచాయతీల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పూర్తిగా నిలిపివేశారు. ఈ కారణంగా పంచాయతీల్లో పారిశుధ్యం ఇతరత్రా పనులు ఆర్థికంగా భారమవుతుంది. ఆ భారం అంతా స్థానికంగా పనిచేసే పంచాయతీ కార్యదర్శుల పై పడుతుండడంతో వాళ్లు ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి వేతనాలు సరైన సమయంలో అందకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
ఇదిలా ఉంటే గత ఏడు నెలల క్రితం ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ ల పదవీకాలం ముగిసింది. దాంతో అప్పటి నుంచి మండల, జిల్లా పరిషత్ లు కూడా ప్రత్యేక అధికారుల చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే. ఇక రేపటి నుంచి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ఖాతాల్లోకి గ్రామపంచాయతీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ తో పాటు మున్సిపాలిటీలు కూడా చేరనున్నాయి. జనవరి 27 నుంచి ప్రజాప్రతినిధులు అంటే ఇక ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లు లెక్క. కానీ వాళ్లంతా ప్రజలకు కలిసేది ఎప్పుడు అప్పటికప్పుడు వచ్చిన సమస్యలు పరిష్కరించేది ఎప్పుడు ? తెలియదు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో...
గ్రామపంచాయతీలు మండల పరిషత్తు జిల్లా పరిషత్తులకు ఇప్పటికే పాలకవర్గాల సీట్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఈ ఖాతాల్లోకి రేపటి నుంచి మున్సిపాలిటీలు కూడా వెళ్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా ఫిబ్రవరి చివర్లో ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే మార్చి రెండో వారం నుంచి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి రెండో వారి నుంచి మొదలుపెడితే దాదాపు ఏప్రిల్ చివరి నాటికి పరీక్షలు కొనసాగనున్నాయి. కాబట్టి ఫిబ్రవరి మాసంలో ఎన్నికలు పెట్టకపోతే దాదాపు మూడు మాసాలు ఇక ఆగాల్సిందే. అంటే మే, జూన్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటే సుమారు ఒక నెల రోజులు సమయం అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం చేపట్టిన బీసీ గణన జాబితా ప్రభుత్వానికి ఇంకా అందలేదని తెలుస్తోంది. ఆ జాబితా అదే తప్ప రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఎన్నికలు ఆలస్యం అవుతాయని అందరు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహించే అంశాన్ని తేల్చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.