- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
10 సంవత్సరాలలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది..

దిశ, మిర్యాలగూడ : గత పది సంవత్సరాలలో అప్పటి ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ క్యాంపు కార్యాలయంలో 76 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాల పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ జెండాను ఆవిష్కరించగా, సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు జాతీయ జెండాలను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్కైలాబ్ నాయక్, వేణుగోపాల్ రెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి, పొదిళ్ల శీను, నామిరెడ్డి యాదగిరి రెడ్డి, చిలుకూరు బాలు, రావు ఎల్లారెడ్డి, రేగటి రవీందర్ రెడ్డి, నర్సిరెడ్డి, పిల్లల సందీప్ తదితరులు పాల్గొన్నారు.