V. Hanumantha Rao : సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరించాలని చూస్తోంది

by Kalyani |   ( Updated:2024-09-12 14:39:03.0  )
V. Hanumantha Rao : సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరించాలని చూస్తోంది
X

దిశ, శాలిగౌరారం : తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతు రావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని సాయుధ పోరాటంలో రజాకార్ల తూటాలకు అసువులు బాసినటువంటి అమరవీరులకు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తుందని,తెలంగాణ సాయుధ పోరాటం, సెప్టెంబర్ 17 ప్రాధాన్యత గురించి మాట్లాడే అర్హత బీజేపీ కి లేదని, తెలంగాణలో బీజేపీ సెప్టెంబర్ 17న సభ ఏర్పాటు చేసి సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి చూపాలని చూస్తుందని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో నెహ్రూ కుటుంబం అనేక త్యాగాలు చేసిందని, అలాంటి వారి ని పక్కన పెట్టి, తక్కువ చేసే ప్రయత్నం చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు.

సాయుధ పోరాటం హిందూ ముస్లింల మధ్య జరిగినట్టుగా బీజేపీ కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు, అమర వీరుల పోరాటాలను, వారి త్యాగాలను తెలియజేసేందుకు సెప్టెంబర్ 17న వల్లాల గ్రామంలో స్మారక స్థూపం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.1947 లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని కానీ తెలంగాణకు స్వాతంత్య్రం రాలేదన్నారు . సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షలు అన్నెబోయిన సుధాకర్, నాయకులు షేక్ ఇంతియాజ్ అహ్మద్, గూని వెంకటయ్య, దండ అశోక్ రెడ్డి, కట్టగూరి సురేందర్ రెడ్డి, మాదగోని రామలింగయ్య, భూపతి అంజయ్య,పెరమాండ్ల నరేష్, నోముల జనార్దన్,వేముల గోపీనాథ్,పాకాల సతీష్,ఆంజనేయులు,పరశురాములు, నరిగే నరసింహ,బిక్షం రెడ్డి,యుగంధర్ రెడ్డి, కడారి అంజయ్య, నూక కిషోర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed