- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ ఇన్ఫ్లో ..

దిశ, నాగార్జునసాగర్ : వర్షాకాలం వచ్చిందంటే చాలు నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పర్యాటకుల సందడి మామూలుగా ఉండదు. ఈసారి కుండపోత వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున జలాశయానికి నీరు చేరింది. ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరడంతో అన్ని గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. దీంతో నాగార్జునసాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. సాగర్కు ఇన్ఫ్లో 2,99,236 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతేస్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు 24 గేట్లు ఎత్తి 2,99,236 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.8 అడుగుల వరకు నీరు ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం 311.44 టీఎంసీల నీరు నిల్వ ఉందని వెల్లడించారు.
ఆదివారం పర్యాటకులు పోటెత్తారు
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినం కావడంతో నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో సాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల సాగుతుంది. ప్రాజెక్టు 24 క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ జల సోయగాలు చూసేందుకు సందర్శకులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ప్రధాన డ్యామ్, పవర్ హౌస్ సందర్శనతో పాటు ఎత్తిపోతల, బుద్ధవనం సందర్శిస్తున్నారు. పర్యాటకులు డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా జాలువారుతున్న కృష్ణమ్మ అందాలను వీక్షిస్తూ సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు.