ప్రశాంత వాతావరణంలో రంజాన్ మాసం జరుపుకోవాలి.. సీఐ వెంకటయ్య..

by Sumithra |
ప్రశాంత వాతావరణంలో రంజాన్ మాసం జరుపుకోవాలి.. సీఐ వెంకటయ్య..
X

దిశ, చండూరు : నేటి నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతున్న దృష్ట్యా 30 రోజుల పాటు ఉపవాస దీక్షలను ముస్లిం సోదరులు కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో దీక్షలు కొనసాగించుకోవాలని చండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ముస్లిం సోదరులను కోరారు. శనివారం సర్కిల్ కార్యాలయంలో చండూరు మున్సిపల్ ముస్లిం సోదరులను ఆహ్వానించి పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. అందులో భాగంగా ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాసాలు ఎలా జరుపుకుంటారు, నమాజు సమయంలో ఎక్కువ మంది ఉండడం ద్వారా సమస్యలు ఎదురు కాకుండా పోలీసు వారు మీకు ఎలాంటి సహాయం చేయాలి అని అడిగి తెలుసుకున్నారు.

ఏమైనా సంఘటనలు జరుగితే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, ఎలాంటి కార్యక్రమాలు చేసినా అందుకు పోలీసు వారికి ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు. మీరూ ప్రశాంత వాతావరణంలో రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటూ తరావి నమాజ్ లు భక్తిశ్రద్ధలతో జరుపుకొంటూ అలాగే రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పోలీసులు, మత పెద్దల ద్వారా పలుసూచనలు సలహాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో చండూరు ఎస్సై వెంకన్న గ్రామ మత గురువు ముజాహిద్ ముస్లిం పెద్దలు హమ్రు, ఏజాసోద్దీన్, అహ్మద్, లతీఫ్ పాష, రహీం బాబా, రజియోద్దీన్, వాజిద్ పాష తదితరులు పాల్గొన్నారు.



Next Story