- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

దిశ, నూతనకల్ : నూతనకల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బూరెడ్డి కళావతి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరుపై స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపట్టిన పనులపై సరైన అవగాహన లేకుండా అధికారులు సమావేశానికి రావడమే కాకుండా, అసంబద్ధంగా పనుల గురించి వెల్లడించడంపై అధికారులను నిలదీశారు. సమావేశానికి వచ్చేటప్పుడు మండలంలో చేపట్టిన కార్యక్రమాలు, పనులపై ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఉండాలని, ఆ విధంగా లేకపోతే క్షమించేది లేదని హెచ్చరించారు. అధికారులు ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
లింగంపల్లి నుంచి నూతనకల్ మీదుగా వెంకేపల్లి వరకు మంజూరైన తారు రోడ్డు నిర్మాణ పనులు జరగకపోవడంపై సంబంధిత అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రతి అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోని, మూమెంట్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలపై ఎంఈఓ రాముల్ నాయక్ ను సమాచారం అడగక సరైన సమాధానం ఇవ్వక పోవడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెవిన్యూ లో జరుగుతున్న భూమాత స్కీం పై రైతులకు అవగాహన కల్పించాలని, భూ సమస్యలు అనేకం నా దృష్టికి వస్తున్నాయని, రైతులందరికీ ఫ్లెక్సీ ల రూపంలో అవగాహన కల్పించి, ఏ అధికారి ఏ సమస్య పరిష్కరిస్తారో తెలిపే విధంగా అవగాహన పరచాలని రెవెన్యూ అధికారులను కోరారు. విద్యుత్ శాఖ పై జరిగిన చర్చలో ఏఈ రాకపోవడంతో సీరియస్ అయ్యారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూసుకోవాలని, అవసరం ఉన్నవారు ప్రభుత్వ అనుమతితో తీసుకోవాలని సూచించారు. ఈనాటి కార్యక్రమంలో జెడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్పర్సన్ నాగం జయసుధ, ఎంపీడీవో సునీత, తాహసిల్దార్ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.