VH: గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే భూ సమస్యలు....

by Kalyani |
VH: గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే భూ సమస్యలు....
X

దిశ, సూర్యాపేట : గత ప్రభుత్వాలు అవలంభించిన విధానాలు, తప్పిదాల వల్లనే నేడు అనేక మంది రైతులు, సామాన్య ప్రజలు భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు,పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు మేడం ముత్తయ్యకు వారసత్వంగా వచ్చిన భూమిని ఇతరులు కబ్జా చేయడం బాధాకరమన్నారు. రైతుకు వచ్చిన భూ సమస్య విషయంలో అప్పటి రెవెన్యూ అధికారులదే పూర్తి తప్పిదమన్నారు. బాధితుల నుంచి వివరాలు తెలుసుకునేందుకు తాను ఆ గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడానని చెప్పారు.

ధరణి లోపాలను అడ్డుపెట్టుకొని గత పాలకులు అధికారులు ఎన్నో పొరపాట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పట్టాదారులను కాదని అనర్హులకు పట్టాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ధరణిని పూర్తి ప్రక్షాళన చెయ్యాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. గతంలో పటేల్,పట్వారీ వ్యవస్థ గ్రామాల్లో ఉన్నప్పుడు ఇలాంటి భూ సమస్యలు లేవన్నారు. ఆ వ్యవస్థ రద్దు కావడం,దానికి తోడు ధరణి రావడంతో అనేక భూ సమస్యలు పెరిగాయన్నారు. ఏ సమస్యకైనా ఆత్మహత్యాయత్నాలు పరిష్కారాలు కావన్నారు. అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ నేనుంటానని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బాధితుల పక్షాన తాను ఎల్లప్పుడూ అండగా నిలబడుత అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ,పలువురు ప్రజా ప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed