- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రంజాన్ మాసాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

దిశ, సూర్యాపేట : పవిత్రమైన రంజాన్ మాసం ప్రశాంత వాతవరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో రంజాన్ మాసం ఏర్పాట్ల పై అధికారులతో, ముస్లిం మత పెద్దలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముస్లిం మతపెద్దలకు, ప్రజలకి ముందుగా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలుపుతూ మార్చి 2 నుండి మొదలయ్యే రంజాన్ మాసం సందర్భంగా ప్రతి గ్రామంలో, మున్సిపల్ వార్డులలో మసీదు, ఈద్గాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని, మురికి కాల్వలో ఉన్న చెత్త తొలగించి దోమలు లేకుండా స్ప్రే చేయాలని, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, వీధి దీపాలు వెలిగేలా చూడాలని, అధికారులకి సూచించారు. ముస్లిం ఉద్యోగులు రంజాన్ మాసంలో ఉపవాసం చేయుటకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మినహాయింపు ఇవ్వాలని అధికారులకి సూచించారు. పండుగ రోజు పాలు ఎక్కువ సరఫరా చేయాలని, షాప్స్, హోటల్స్ ఎక్కువ సేపు ఓపెన్ చేసేందుకు మున్సిపల్, లేబర్, పోలీస్ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
వార్డులలో, గ్రామాలలో త్రాగునీరు ఎక్కువ సరఫరా చేయాలని అవసరం ఉన్నచోట ట్యాంకర్ల సహాయం ద్వారా నీరు సరఫరా చేయాలని తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా చేయాలని, ఆప్రోచ్ రోడ్లకి గుంటలు ఉంటే పుడ్చాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడుకొనుటకు , ట్రాఫిక్ నియంత్రణ కొరకు పోలీస్ శాఖ అధికారులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
పవిత్రమైన రంజాన్ మాసంలో పేదవారికి ధానధర్మాలు, సేవ చేయాలని గంగ యమునా తెహజీబ్ లాగా హిందూ ముస్లిం సోదరులు కలిసి మెలిసి పవిత్రమైన రంజాన్ మాసం సోదర భావంతో జరుపుకునేలా మత పెద్దలు, శాంతి (పీస్ )కమిటీ సభ్యులు సహకరించాలని కోరినారు. తదుపరి ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ కబరస్తాన్ లో పిచ్చి చెట్లు తొలగించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరావు, జిల్లా మైనార్టీ అధికారి జగదీశ్వర్ రెడ్డి, డీఎంహెచ్ఓ కోటాచలం, ఆర్డీఓలు వేణుమాధవ్ రావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు, డీఎస్పీ రవి, మున్సిపల్ కమిషనర్లు, మత పెద్దలు, ఇమామ్ లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.