కాంగ్రెస్ కార్యకర్తల కష్టం వెలకట్టలేనిది : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

by Kalyani |
కాంగ్రెస్ కార్యకర్తల కష్టం వెలకట్టలేనిది : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
X

దిశ,నల్గొండ: ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటింగ్ సెంటర్ వద్ద మాట్లాడుతూ… రఘువీర్ ని 5. 50 లక్షల ఓట్ల పైచిలుకు అత్యధిక మెజారిటీతో గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. భువనగిరిలో 2లక్షల పై చిలుకు మెజార్టీతో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచామని అన్నారు. అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు వెళుతున్నమని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం అని అన్నారు. మంత్రి ఉత్తమ్, నేను జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, కాంగ్రెస్ 9 నుంచి 12 స్థానాలు వస్తాయి అనుకున్నమని పేర్కొన్నారు. రఘువీర్ కి ఇంత భారీ మెజార్టీ రావడంలో కాంగ్రెస్ కార్యకర్తల కష్టం వెలకట్టలేనిది అని అన్నారు.



Next Story

Most Viewed