- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘దిశ’ ఎఫెక్ట్...అమలు కాని ఎన్నికల కోడ్ కథనానికి స్పందన..

దిశ,చివ్వేంల : మండలకేంద్రంలో ఎన్నికల కోడ్ అమలు కావడం లేదని,తెలంగాణలోని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు షెడ్యూల్ విడుదల చేశారు.వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నర్సిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు.ఆయన పదవీకాలం ముగియడంతో ఫిబ్రవరి 27న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానాల పరిధిలోని తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది.
ప్రధానంగా నిత్యం మండల అధికారులు ఉండే చివ్వెంల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం కు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిలాఫలకాలకు ముసుగులు వేయకుండా దర్శనమిస్తున్నాయని పక్కాగా ఎన్నికల నియమావళిని అమలు చేయాలని బుధవారం మధ్యాహ్నం దిశ వెబ్ లో వార్త ప్రచురించడం జరిగింది.వెంటనే స్పందించిన మండల అధికారులు శిలాఫలకాలకు ముసుగులు వేశారు. ఎలక్షన్ కోడ్ అమలు కావడం లేదని దిశ వెలుగులోకి తీసుకు రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.శిలాఫలకాలకు ముసుగులు వేయించినందుకు దిశ పత్రికకు మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.