త్రిచక్ర వాహనంపై వెళ్తున్న వికలాంగుడు మృతి..అసలేం జరిగిందంటే..?

by Naveena |
త్రిచక్ర వాహనంపై వెళ్తున్న వికలాంగుడు మృతి..అసలేం జరిగిందంటే..?
X

దిశ, మర్రిగూడ: త్రిచక్ర వాహనం అదుపుతప్పి వికలాంగుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్సై ఎం.కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా లోయ పల్లికి చెందిన బూడిద రాములు (70) ఆదివారం సాయంత్రం తన త్రి చక్ర వాహనంతో వడ్డే పెల్లికి వెళుతుండగా..రామ్ రెడ్డి పల్లి సమీపంలోని చర్లగూడెం మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింద. దీంతో రాములు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స కోసం మర్రిగూడ ఆసుపత్రికి తరలిస్తుండగా రాములు మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఎల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



Next Story

Most Viewed