అడుగంటుతున్న సాగరం.. గొంతెండిపోనున్న భాగ్యనగరం

by Sumithra |
అడుగంటుతున్న సాగరం.. గొంతెండిపోనున్న భాగ్యనగరం
X

నాగార్జునసాగర్ జలాశయం రోజురోజుకూ అడుగంటుతోంది. 1956 సాగర్ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జలాశయం పూర్తిగా ఎండిపోయింది. నాగార్జునసాగర్‌ నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. వేసవి మొదట్లోనే ప్రాజెక్టులో నీరు అడుగంటిపోతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 515 అడుగులకు పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించే సాగర్‌ అడుగంటుతుండడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రమాదకరస్థాయిలో డెడ్‌ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్‌ బెల్స్‌ను మోగిస్తోంది. దీంతో సాగర్‌, కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్‌ జంట నగరాలు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉంది.

దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయం అడుగంటిపోయింది. 1956 సాగర్ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జలాశయం పూర్తిగా ఎండిపోయింది. నాగార్జునసాగర్‌ నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతుంది. వేసవి మొదట్లోనే ప్రాజెక్టులో నీరు అడుగంటిపోతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 515 అడుగులకు పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించే నాగార్జునసాగర్‌ అడుగంటుతోంది. ప్రమాదకరస్థాయిలో డెడ్‌ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్‌ బెల్స్‌ను మోగిస్తోంది. దీంతో సాగర్‌, కృష్ణా జలాల పై ఆధారపడిన హైదరాబాద్‌ జంట నగరాలు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉంది.

మంచినీటి సరఫరా పై తీవ్ర ప్రభావం

నాగార్జునసాగర్‌ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 516 అడుగుల నీరు మాత్రమే ఉంది. దీంతో హైదరాబాద్‌ నగరానికి భవిష్యత్‌లో తాగునీటి సరఫరా చేసేందుకు ఇబ్బంది కానున్నది. సాగర్‌ జలాశయంలో 510 అడుగుల నీరు ఉంటేనే ఏఎమ్మార్పీ ఎత్తిపోతల ద్వారా హైదరాబాద్‌ నగరానికి తాగునీటిని సరఫరా చేయడం వీలవుతుంది. 510 అడుగుల కంటే తక్కువ ఉంటే నీటిని పంపింగ్‌ చేయడం సాధ్యం కాదు. పంపింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటిని అందిస్తున్న నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు ఆందోళనకర రీతిలో తగ్గుతున్నాయి. రోజుకు దాదాపు 2 టీఎంసీల నీటిని సాగర్ నుంచి వివిధ అవసరాలకు ఇరిగేషన్ అధికారులు వినియోగిస్తున్నారు. సాగర్‌లో నీటి నిల్వలు తగ్గితే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉందని, సిటీ తాగునీటి అవసరాలకు సరిపడా నిల్వలను మెయిన్ టెయిన్ చేయాలని వాటర్ బోర్డు అధికారులు ఇరిగేషన్ శాఖకు లెటర్ రాశారు. డెడ్ స్టోరేజీ 510 అడుగులకు చేరితే ఎమర్జెన్సీ పంపింగ్ చేయాల్సి వస్తుందని వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌తోపాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలకు మెట్రో వాటర్ బోర్డు నీరు అందిస్తోంది. ప్రస్తుతం నగరానికి ఆరు ప్రధాన వనరుల నుంచి రోజుకు 581.35ఎంజీడీల(మిలియన్ గ్యాలన్స్ పర్ డే) నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్క నాగార్జునసాగర్ నుంచే కృష్ణా ప్రాజెక్టు ఫేజ్-1, 2, 3 ద్వారానే రోజుకు 275ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు.

గత వానకాలంలో...

కృష్ణా పరీవాహక ప్రాంతంలో గత వానకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లిన విషయం తెలిసిందే. ఆల్మట్టి నుంచి మొదలుపెట్టి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలగా వందలాది టీఎంసీల నీరు సముద్రం పాలైంది. అంటే, ప్రాజెక్టుల్లో ఇప్పటికీ పుష్కలంగా నీరు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ వేసవి ప్రారంభంలోనే కృష్ణానది ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు కనీస స్థాయికి చేరువవుతుండడం ఆందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని ఎడమ, కుడి కాల్వలతోపాటు ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పరిధిలోనూ మరో నెల రోజుల పాటు పంటలకు సాగు నీటితోపాటు మళ్లీ వానకాలంలో వర్షాలు కురిసే వరకు తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. ప్రభుత్వానికి నీటి విడుదల, భవిష్యత్‌ అవసరాలపై సరైన ప్రణాళిక లేకపోవడంతో మార్చి మధ్యలోనే నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ డెడ్‌స్టోరేజీకి చేరుతున్నదని నీటి పారుదల నిపుణులు చెప్తున్నారు. ఏప్రిల్‌ 2వ వారం వరకు ఆయకట్టుకు సాగునీటి అవసరం ఉండగా డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నాక ఏం చేస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు రోజురోజుకూ అడుగంటుతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. రానున్న రోజుల్లో తాగు, సాగు నీటికి కష్టాలు తప్పేట్లు లేదని సాగునీటి రంగ ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు ఈ ఏడాది వరద ఆశాజనకంగా రావడంతోపాటు ఎడతెరిపి లేకుండా మూడు నెలల పాటు క్రస్ట్‌ గేట్ల ద్వారా 627 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రం పాలైంది. ఈ ఏడాది నాగార్జునసాగర్‌ ఆయకట్టు కింద రెండు పంటలకు నీటికి ఢోకా ఉండదని అందరూ భావించినా, అందుకు భిన్నంగా అనూహ్యంగా సాగర్‌ చూస్తుండగానే డెడ్‌ స్టోరేజీకి చేరుకుంటున్నది.

రోజుకో అడుగు తగ్గుదల...

నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో 6.30లక్షల ఎకరాల్లో సాగైన ఆరు తడి పంటల కోసం ప్రభుత్వం ఆన్‌‌అండ్‌‌ఆఫ్‌‌ పద్ధతిలో నీటిని విడుదల చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు సాగర్‌‌ నుంచి ఇబ్బడిముబ్బడిగా నీటిని తోడేస్తున్నాయి. దీంతో ప్రాజెక్ట్‌‌లో రోజుకో అడుగు (2టీఎంసీలు) చొప్పున నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం సాగర్‌‌లో 515అడుగుల నీరు ఉండగా.. వాడకం ఇలాగే కొనసాగితే మరో 10రోజుల్లోనే సాగర్‌‌ నీటిమట్టం డెడ్‌‌ స్టోరేజీ అయిన 510అడుగులకు చేరనుంది. సాగర్‌‌ ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టుకు యాసంగి సీజన్‌‌లో ఏప్రిల్‌‌ వరకు వారబందీ విధానంలో నీటిని విడుదల చేయాల్సి ఉంది. వేసవి పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందు పరిస్థితి ఇలా ఉంటే.. ముందు ముందు పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు జంట నగరాల తాగునీటి అవసరాల కోసం సాగర్‌‌ నుంచి నిత్యం 290ఎంజీడీ నీటిని తరలిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీరు మరో మూడు నెలల వరకు తాగునీటి అసరరాలను తీర్చుతుందా అన్నది సందేహంగా మారింది.



Next Story

Most Viewed