- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎండిపోతున్న వరి పంటలను కాపాడాలని రైతుల ఆందోళన

దిశ, పెన్ పహాడ్: ఎండిపోతున్న వరి పంటలను కాపాడాలని రైతులు ఆందోళన చేశారు. ఎస్ ఆర్ ఎస్ పి కాలువల నుంచి కాలేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి నీటిని మండలంలోని చివరి భూముల వరకు సాగుచేసిన వరి పంటలు ఎండిపోకుండా నీటిని అందించి, రైతులను ఆదుకోవాలని మండల పరిధిలోని చిన్న గారెకుంటా తండా, పెద్దగారకుంట, చిన్న సీతారాం తండా, పెద్ద సీతారాం తండా గ్రామాలకు చెందిన రైతులు తమ పొలాల వద్ద బుధవారం ఆందోళన చేపట్టి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వానకాలం వరి సాగు చేసినప్పుడు నీటిని అందించిన ప్రభుత్వం వేసవికాలం కూడా నీటిని అందిస్తుందని,గత ప్రభుత్వాలు అందించాయాని వరి పంట సాగు చేయడం జరిగిందన్నారు. దీంతో వానకాలం పండించిన పంటల్లో వచ్చిన డబ్బుల ద్వారా యాసంగి పంటల కోసం బోర్లు, బావులు తవ్వించి అప్పుల పాలై ఇబ్బంది పడుతున్నామన్నారు. ప్రభుత్వం మరొక మూడు రోజుల్లో ఎండిన పంటలకు నీటిని అందించకపోతే తమకు మూకుమ్మడిగా చావే చరణీయమని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా అధికారులకు రాజకీయ నాయకులకు విన్నవించినప్పటికీ పట్టించుకోకపోవడంతో..ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రమంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దామోదర్ రెడ్డి,టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమస్యని పట్టించుకొని సాగునీరు అందించాలన్నారు. సాగర్ ఎడమ కాలువ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి 9 తండాల గిరిజన రైతులకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. లేని పక్షంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టి అన్ని గిరిజన తండాలకు చెందిన 3వేల మంది రైతులతో హైదరాబాదులోని గాంధీభవన్ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం రహదారిపై మోకాళ్ళతో నిరసన తెలిపి ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు ధారావత్ మోతిలాల్ నాయక్, రైతులు దారావత్ బాల, ధారావత్ నాగు, దారావత్ టాకిరియా, బానోతు నరసింహ, బర్మావత్ నగేష్, బర్మావత్ కోటి, బర్మావత్ సుజాత, లాలి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.