- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన వ్యాపారి..

దిశ,తుంగతుర్తి: తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద మధ్యతరగతి కుటుంబాలకు శుభవార్త...తక్కువ ధరకే పెరుగు.. ఉచితంగా కోడిగుడ్డు...!! రూ.5కే ఒక కోడిగుడ్డు..ఇది చదివిన వారికి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన బాగుంది కదా...అని అంతా అనుకుంటారు. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన కాదండి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఓ ప్రైవేటు వ్యాపారి తీసుకున్న నిర్ణయం. కొత్తగా కూల్ డ్రింక్స్, కోడిగుడ్లు,పెరుగు,పాల వ్యాపారాన్ని ప్రారంభించిన సదరు దుకాణాదారుడు వినియోగదారులను ఆకర్షించడానికి విచిత్ర తరహాలో ప్రచారాలు చేపట్టారు.10 కేజీల పెరుగు బకెట్ కు రూ.600కు తోడు ఒక కోడిగుడ్డు ఉచితంగా ఇవ్వబడును. అంతేకాకుండా విటమిన్ ఏ,బి,సి,డి పుష్కలంగా ఉండే పాలు,పెరుగు ప్యాకెట్లు,రూ.5కే ఒక కోడి గుడ్డు అంటూ ప్రచారాలు చేపట్టారు. వాస్తవానికి కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిల దృష్ట్యా గుడ్ల ఉత్పత్తి దారుణంగా తగ్గింది. ఈ తరుణంలో గుడ్డు రేటు కూడా అమాంతం రూ.6కు పైనే పెరిగింది. ఈ తరుణంలో సదరు వ్యాపారి గుడ్డు ధరను తగ్గించి అమ్మడం అందరినీ ఆకట్టుకుంటుంది.