రాష్ట్రంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగమే : ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Kalyani |
రాష్ట్రంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగమే : ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, హుజూర్ నగర్ /నేరేడుచర్ల : తెలంగాణ రాష్ట్రంలోనే హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ‌ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి తో కలిసి విస్తృతంగా పర్యటించారు. ముందుగా హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద 40 కోట్లతో నిర్మాణం చేయబోయే ఐటిఐ కాలేజ్ పనులకు శంకుస్థాపన పనులను ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతీ, యువకులను వారి ఉద్యోగ కల్పనకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది ప్రాణత్యాగం చేసి పోరాడిన యువతీ యువకులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు ఎక్కువ ఉద్యోగ కల్పన చేయాలనే ఉద్దేశంతో ఐటిఐ కాలేజ్ నిర్మాణాలను చేపట్టిందని అన్నారు. దీనిలో భాగంగా హుజూర్ నగర్ లో నూతన ఐటిఐ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నానని దీని ద్వారా యువతకు ట్రైనింగ్ లు ఇచ్చి పరిశ్రమలలో ఉద్యోగ కల్పనకు వీలవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన, శిక్షణ శాఖ పరిధిలో 65 ప్రభుత్వ 225 ప్రైవేటు 290 అందుబాటులో ఉన్నాయని వీటిలో 32 కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కొత్తగా సోలార్ టెక్నీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ టెక్నాలజీ తదితర కోర్సులను కూడా ప్రారంభించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐ లలో సుమారు 76,900 సీట్లు 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు .ఐటిఐ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థిని, విద్యార్థులకు అప్రెంటిస్ శిక్షణ ఇచ్చేందుకు ప్రతినెల రెండో సోమవారం వివిధ ప్రభుత్వ ఐటిఐ లలో అప్రెంటిస్ మేళాలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అప్రెంటిస్ శిక్షణ సమయంలో విద్యార్థులకు సుమారు 8 వేల రూపాయల నుండి 11500 రూపాయల వరకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. హుజూర్నగర్ నందు ఏర్పాటు చేస్తున్న ఐటిఐ లో ఎలక్ట్రిషన్ 40 సీట్లు ,ఫిట్టర్ 40 సీట్లు, డ్రాఫ్ట్మెన్ సివిల్ లో 48 సీట్లు, డీజిల్ మెకానిక్ కోర్స్ లో 48 సీట్లు, వెల్డర్ కోర్స్ లో 40 సీట్లు అందుబాటులో ఉంటాయని యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారి సహకారంతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా ఆధునీకరించడం జరుగుతుందని సుమారు 2,324 కోట్ల రూపాయలతో ఐటిఐ లను ఆధునికణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. హుజూర్ నగర్ మండలంలోని లింగగిరి లో హుజూర్ నగర్ నుంచి యాతవాకిళ్ళ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి అలాగే రోడ్డు విస్తరణ పనులకు 20 కోట్ల రూపాయలతో వ్యయంతో శంకుస్థాపన చేశారు. నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి సోమవారం కొత్త డబుల్ రోడ్డు నిర్మాణం కొరకు రోడ్డు విస్తరణ పనులకు 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్డుకు శంకుస్థాపన చేశారు.

అంతకుముందు కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి, ఘనంగా స్వాగతం పలికారు. నేరేడుచర్ల మండలంలోని బోడల దీన్నే నుండి పలువురు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో మంత్రి సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కల్పన సగ డిప్యూటీ డైరెక్టర్ రాజా హుజూర్ నగర్ నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్లు గెల్లి అర్చన రవి , బచ్చలకూరి ప్రకాష్ ఎంపీపీలు జి.శ్రీను లకమల్ల జ్యోతి భుక్య గోపాల్ జడ్పిటిసిలు రాపోలు నరసయ్య మాలోత్ బుజ్జి మోతిలాల్ హుజూర్ నగర్ నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి అలక సరిత సైదిరెడ్డి రైల్వే బోర్డు మెంబర్ నాగన్న శంకర్ నాయక్ ఆర్డీఓ శ్రీనివాసులు నేరేడుచర్ల మున్సిపల్ కౌన్సిలర్ కొనతం చిన్న వెంకటరెడ్డి వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed