- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నీటి ఎద్దడి పై అధికారులు చర్యలు చేపట్టాలి

దిశ, హుజూర్ నగర్: రానున్న వేసవిలో మంచి నీటి ఎద్దడి నివారణకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ .ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ సచివాలయంలో హుజూర్ నగర్, నేరేడు చర్ల, కోదాడ మున్సిపాలిటీ లో జరుగుతున్న పనులు వేసవిలో మంచి నీటి ఎద్దడి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై మున్సిపల్ అధికారులు, ట్రాన్స్కో అధికారులు, పబ్లిక్ & హెల్త్ అధికారులు, ప్రజాప్రతినిధులు , పార్టీ అధ్యక్షులతో నీటి పారుదల , పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్లు తెలియజేశారు. వేసవిలో మంచి నీటి ఎద్దడి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. నీరు సమృద్ధిగా ఉన్న బావులను, ట్యాంకర్లను లీజుకు తీసుకోవాలన్నారు . కోదాడ మున్సిపాలిటీలో (అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్ మెంట్ ఫండ్స్) రూ. 230 కోట్లతో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేయడం జరిగిందన్నారు.
నేరేడుచర్ల, హుజూర్నగర్, కోదాడ మున్సిపాటీలలో పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయాలన్నారు. మోడల్ కాలనీ నిర్మాణానికి అక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ను షిఫ్ట్ చేయాలన్నారు. 3 ఫేజ్ విద్యుత్ సరఫరాను పునరుద్దరణ చేయాలని & అవసరమైన ఇసుకను సమకూర్చుకోవాలన్నారు. మున్సిపాలిటీ భూముల విషయంలో కోర్టులో ఓడిపోతే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. మున్సిపాలిటీలో రోడ్ల నిర్మాణం విషయంలో విద్యుత్ శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు సమన్వయంతో ముందుకు పోవాలన్నారు. చాలా చోట్ల రోడ్ల మధ్యలో విద్యుత్ స్తంభాలు తొలగించక పోవడంతో రోడ్డు నిర్మాణ పనులు నిలచి పోయాయని సమస్యను పరిష్కరించి రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. హ్యాంగ్ అయిన విద్యుత్ లైన్లను & డ్యామేజ్ అయిన విద్యుత్ పోల్స్ను వెంటనే మార్చాలని ప్రజా ప్రతినిధులు సూచించిన పొడిగింపుకు సంబంధించిన విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
హుజూర్ నగర్లో రింగ్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. హుజూర్ నగర్ మెయిన్ రోడ్డు పైప్ లైన్ & రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. హుజూర్ నగర్లో బరేల్ గ్రౌండ్ ప్రదేశాన్ని సమగ్రంగా పరిశీలించి వెచ్చించిన నిధులకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. హుజూర్ టౌన్ హాల్ కేటాయించిన కోటి రూపాయల నిధులతో ప్రాధాన్యత గల పనులను చేపట్టి పూర్తి చేయాలన్నారు. హుజూర్ నగర్ గ్రంథాలయ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో మిగిలిపోయిన ప్రధాన రోడ్ల వెడల్పు చేపట్టాలని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని , కోదాడ, నేరేడుచర్ల మున్సిపాలిటీ భవనాలు శిథిలావస్థకు చేరాయని, వాటి స్థానంలో నూతన భవనాలు మంజూరు చేయాలని, వార్డులో ఓల్టేజితో ఉన్న చోట్ల అదనంగా ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేయాలని తదితర సమస్యలను మున్సిపల్ చైర్మన్ లు, కౌన్సిలర్లు , పట్టణ అధ్యక్షుడు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సమీక్షా సమావేశం లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.