- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే సంస్థ లక్ష్యం

దిశ , మిర్యాలగూడ టౌన్ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే ఆర్టీసీ సంస్థ లక్ష్యమని నల్గొండ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జానిరెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ ఆర్టీసీ డిపో పరిధిలో పవర్ డ్రైవర్ కండక్టర్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ తరగతులలో ఆయన హాజరై ప్రయాణికులతో ఎలా మెలగాలి,తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆర్ ఎం జానీరెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు..ఆర్టీసీ సంస్థను అభివృద్ధి దిశలో ముందు తీసుకెళ్లేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే నల్గొండ రీజన్ పరిధిలో 136 ఈ బస్సులు ( ఎలక్ట్రికల్) బస్సులు నడుస్తాయని తెలిపారు. నల్గొండ జిల్లాకు 72 ఈ బస్సులు సూర్యాపేట జిల్లాకు 64 "ఈ బస్సులు" మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు. నల్గొండ, సూర్యాపేటలో ఆర్టీసీ పరిధిలోని ఎలక్ట్రికల్ బస్సు ఛార్జింగ్ స్టేషన్లో ప్రారంభించిన వెంటనే నల్గొండ, సూర్యాపేట జిల్లా కేంద్రల నుంచి వివిధ ప్రాంతాలకు ఈ బస్సులు నడపనున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం ఆర్టీసీ సిబ్బంది కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 13 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేస్తున్నామని ఆయన వివరించారు. డ్రైవర్ కండక్టర్లకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి ఆరోగ్యం సంబంధించిన రిపోర్టు తెలుసుకొని మెడిసిన్ అందజేస్తారని ఆయన తెలిపారు. నల్గొండ రీజియన్ పరిధిలో ఏడి డిపోలలో 1750 మంది డ్రైవర్ కండక్టర్లు గ్యారేజ్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. కోదాడ ఆర్టీసీ డిపో నుంచి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మట్టంపల్లి తదితర పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు. అదే విధంగా మిర్యాల డిపో నుంచి వాడపల్లి క్షేత్రశాల సోమప్ప దేవాలయాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ డిపో మేనేజర్ రామ్మోహన్ రెడ్డి, సీఐ భారతి బాయి ఉన్నారు.