ఆదమరిస్తే అంతే.. ఇళ్ల పక్కనే కంచె లేని ట్రాన్స్ ఫార్మర్‌లు..

by Aamani |
ఆదమరిస్తే అంతే.. ఇళ్ల పక్కనే కంచె లేని ట్రాన్స్ ఫార్మర్‌లు..
X

దిశ,వలిగొండ: మండలంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో సమస్యలు రోజు రోజుకు పెరిగిపోయి ప్రజలను వెంటాడుతున్నాయి.ఇండ్ల పక్కన కంచలేని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ లు ప్రమాదకరంగా మారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతూ, ఇళ్లకు ఆనుకొని ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.అదేవిధంగా కొన్ని గ్రామాల్లో రైతుల పొలాల్లో విద్యుత్ తీగలకు కిందకి వరకు ఉన్నాయి. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మండలంలోని లింగరాజు పల్లి,జాలు కాలువ గ్రామాల్లో ఏళ్లు కావొస్తున్నా ట్రాన్స్ ఫార్మర్లకు రక్షణగా కంచెలు ఏర్పాటు చేయక పోవడంతో, ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

అంతేకాకుండా ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ వర్షాలు పడినప్పుడు పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదం జరిగే అవకాశం దీన్ని పట్టించుకునే నాథులే కరువయ్యారని గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా చుట్టూ రక్షణ కంచెలు లేకపోవడంతో, ట్రాన్స్ ఫార్మర్ దిమ్మెలు సైతం తక్కువ ఎత్తులో ఉండడం తో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా లింగరాజు పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సమీపంలో ఏర్పాటుచేసిన ట్రాన్స్ ఫార్మర్ ఇంటి పక్కనే ఉన్నది.ఇండ్ల పక్కనే రక్షణ లేక ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటికి రక్షణ చర్యలు చేపట్టలేదు. దీంతో ఆ ప్రాంతంలో చిన్న పిల్లలు ఆటలు ఆడుతుంటారు.

వాటిని ఎరుగక పిల్లలు పొరపాటున అక్కడకు వెళితే ఏం జరుగుతుందోనని ప్రజలు వాపోతున్నారు.అదేవిధంగా పిచ్చి మొక్కలు,చెట్లను మేయడానికి మూగ జీవాలు అక్కడికి వచ్చి విద్యుత్ షాక్ కు గురై మరణించే ప్రమాదం లేకపోలేదు.అంతేకాకుండా జాలు కాల్వ గ్రామంలో బస్టాప్ సమీపంలో గల ఓ ఇంటి పక్కన ట్రాన్స్ఫార్మర్ కు ఎటువంటి రక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. వర్షాలు పడినప్పుడు పెను ప్రమాదంగా జరిగే అవకాశం ఉన్నది .ఇప్పటికైనా విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని మండల ప్రజలు కోరుచున్నారు.



Next Story

Most Viewed