- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గ్రామీణ క్రియేటర్స్ కి తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఓ చక్కటి వేదిక

దిశ, సూర్యాపేట : గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన న్యూ క్రియేటర్స్ కి తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఒక వేదిక లాగా ఉపయోగపడుతుందని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ హైటెక్ సిటీ లోని నోవాటెల్ లో జరిగిన తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ప్రముఖ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి, మరో సినీ హీరో విజయ్ దేవరకొండ లతో కలిసి పటేల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రియేటర్స్ గ్రామీణ ప్రాంతాలకి సంబంధించిన సమస్యలపై పోరాడటానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం శుభపరిణామం అని, అందుకు ప్రముఖులందరికి శుభాకాంక్షలు తెలియజేస్తు న్నట్లు చెప్పారు. సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటే ఒక గాడ్ ఫాదర్ లాంటివాడు ఉండాలని గతంలో మనమందరం వినేవారమని,కానీ ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా స్వశక్తితో మెగాస్టార్ నేడు ఈ స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు.
అదే మాదిరిగానే సోషల్ మీడియా వచ్చిన తర్వాత క్రియేటర్స్ కి ఈ అవకాశం చక్కటి వేదిక అని, అందుకోసం టాలెంట్ తప్ప ఇక్కడ ఇంకేమి అవసరం లేదన్నారు. ఈ ఫెడరేషన్ కి మున్ముందు ఎలాంటి సమస్యలు తలెత్తినా తన వంతుగా వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం క్రియేటర్స్ అందరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థినీ,విద్యార్థులకు ఉన్నత విద్యకై తమ వంతు కృషి చేయాలని కోరారు.