మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ

by Sridhar Babu |
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ
X

దిశ,అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : తెలంగాణ మట్టిలో మతసామరస్యం సహజంగానే వెల్లివిరిసిందని తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేల్ అన్నారు. జాజిరెడ్డిగూడెం గ్రామంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపెల్లి మధుకర్ రెడ్డి సొంతంగా రూ.3 లక్షలతో నిర్మించిన అషుర్ ఖానాను సోమవారం ప్రారంభించారు. అనంతరం మధుకర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.

యాదవులు తమ ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి, సౌడమ్మ దేవాలయాలకు సీసీ రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దరూరి యోగానంద చార్యులు, బ్లాక్ కాంగ్రెస్, అధ్యక్ష ఉపాధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, నర్సింగ శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు మోరపాక సత్యం, ఎంపీటీసీ నర్సింగ నాగమ్మ, ఇందుర్తి వెంకటరెడ్డి, కుంట్ల సురేందర్ రెడ్డి, దాసరి సోమయ్య, నర్సింగ వెంకటేశ్వర్లు గౌడ్, శిగ నసీర్, కృష్ణమూర్తి, జలేందర్, వెంకన్న, రాములు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed