- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సాగర్ టెయిల్పాండ్ వ్యవహారంలో కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ

దిశ, నాగార్జునసాగర్: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. తాజాగా టెయిల్పాండ్ కేంద్రంగా ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం తెరపైకి వచ్చింది. టెయిల్ పాండ్ నుంచి ఏపీ సర్కార్ అక్రమ నీటి తరలింపును అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల అంశం చర్చనీయాంశమైంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన టెయిల్ పాండ్ తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదానికి తెరలేపింది. ప్రాజెక్ట్ లో అంతర్భాగమే అయినప్పటికీ టెయిల్ పాండ్ మొత్తం ఏపీ పరిధిలోనే ఉంది. దీంతో టెయిల్పాండ్ నుండి నీటిని తరలింపు. నాగార్జున సాగర్ కేంద్రంగా గత ఏడాది నవంబర్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదం టెన్షన్కు దారితీసింది.
దీంతో ప్రధాన డ్యాం పూర్తిగా కేఆర్ఎంబీ పర్యవేక్షణలో కేంద్ర బలాగాల పహారాలో ఉంది. ఇప్పటికీ డ్యాం నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. కృష్ణా జలాల పంపిణీ పై కేఆర్ఎంబీ ఇరు రాష్ట్రాలతో చర్చిస్తూనే ఉంది. తాజాగా తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాల్లో తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి ఐదు టీఎంసీల నీటిని కేఆర్ఎంబీ కేటాయించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ.. టెయిల్ పాండ్లోని నీటిని అనుమతి లేకుండా తరలించింది. నాగార్జున సాగర్ డ్యామ్ దిగువన ఉన్న టెయిల్ పాండ్లో నీటి నిల్వలు ఖాళీ అయ్యాయి. కొద్ది రోజులుగా టెయిల్ పాండ్ కుడివైపు నుంచి ఏపీ సర్కార్ మొత్తం నీటిని తరలించింది. టెయిల్పాండ్ తెలంగాణ జెన్ కో ఆధీనంలో ఉంది. అత్యవసర సమయాల్లో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం టెయిల్ పాండ్లో 6.5 టీఎంసీల నీరు ఉండగా, నాలుగు రోజుల క్రితం టెయిల్ పాండ్ కుడివైపు నుంచి 4 టీఎంసీల నీటిని అనుమతి లేకుండా ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు తరలించారు.
టెయిల్పాండ్ వివాదంపై కేఆర్ఎంబీ కి తెలంగాణ సర్కార్ లేఖ ఏపీ సర్కార్ టెయిల్ పాండ్ నీటి తరలింపుపై తెలంగాణ జెన్కో, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు వివరాలు సేకరించి ప్రభుత్వానికి తెలిపారు. ఈ మేరకు టెయిల్పాండ్ నుంచి నీటి విడుదలను నిలిపివేయాలంటూ తెలంగాణ సర్కార్ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. టెయిల్పాండ్ నుండి నీటి తరలింపుతో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలంగాణ సర్కార్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్ఎస్పి టెయిల్ పాండ్ 7 టిఎంసిల నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ఇది ప్రధాన ప్రాజెక్ట్ నుండి 21 కిలోమీటర్ల దిగువన ఉన్న బహుళార్ధసాధక రిజర్వాయర్. ఇది విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రాజెక్టు నుండి విడుదల చేసిన నీటిని నిల్వ చేయడానికి ఉద్దేశించబడింది.
నీటిని తిరిగి ప్రధాన ప్రాజెక్టులోకి పంప్ చేస్తారు మరియు పీక్ అవర్ పవర్ లోడ్ను తీర్చడానికి విద్యుత్ ఉత్పత్తి కోసం రీసైకిల్ చేస్తారు. అనధికారికంగా నీటిని లాగడంపై తెలంగాణ జెన్కో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. సాగర్ జల విద్యుత్ కేంద్రం అవసరాల కోసమే టెయిల్పాండ్ నిర్మించారని, దానిలో 6.737 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ఏపీ ప్రభుత్వం 4 టీఎంసీల వరకు తరలించిందని కేఆర్ఎంబీ చైర్మన్ శివ్నందన్ కుమార్కు, ఈఎన్సీ అనిల్కుమార్ రాసిన లేఖలో పేర్కొన్నారు. నీటి అవసరాలు కోసం టెయిల్పాండ్ కట్టలేదని, కేవలం నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రంలో రివర్సబుల్ పంపింగ్ కోసం కట్టారని గుర్తు చేశారు. కృష్ణా బోర్డు తక్షణమే జోక్యం చేసుకోవాలని లేఖలో పేర్కొంది