- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సంక్షేమ రాజ్యానికి చిరునామాగా తెలంగాణ..: మంత్రి తుమ్మల

దిశ,సూర్యాపేట : సంక్షేమ రాజ్యానికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రం నిల్చిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ,జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ఆదివారం సూర్యాపేట మండలం, కె టి అన్నారం గ్రామంలో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ...రాష్ట్ర ప్రజలందరికి 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి ఇచ్చిన మాట మేరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు అనే నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తమని తెలిపారు. ప్రజలందరూ కలిసి ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన ఒక్క సంవత్సరం లోనే ఆరు గ్యారెంటీ లు అమలు చేశామని , ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా పేదల జీవితాలలో వెలుగులు నింపటానికి దశల వారీగా ఒక్కొక్క ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 22 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేశామని, సాగు చేయు ప్రతి ఎకరానికి రైతు భరోసా కింద 12,000 ఇస్తున్నామని అన్నారు.
భూమిలేని రైతు కూలీల కొరకు రూ. 12,000 ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు.ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి సొంత ఇంటి కల నెరవేరబోతుందని, అర్హులైన నిరుపేదలకు ఇళ్ళు కట్టుకునేందుకు రూ.5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. గత పదేండ్లు గా ఇవ్వని రేషన్ కార్డులు మీరు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చేందుకు నిరంతరం దరఖాస్తు లు స్వీకరిస్తున్నామని,పరిశీలన చేసి అర్హత ఉంటే అందరికి అందజేస్తామని తెలిపారు.అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులని గుర్తించాలని అలాగే ప్రజలు ఎవరికైనా అర్హత లేకుండా పథకాలు పొందితే తెలియజేసే ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయుటకు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ అంత నిరంతరం కృషి చేసి సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి వరకు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
సభకు అధ్యక్షత వహించిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు పార్టీలు ఇచ్చిన వాగ్దానాల మేరకు అన్ని పథకాలు అందజేయాలని, అధికారంలో ఎవరు ఉన్న ప్రజలకు ఏమైతే అత్యవసరం ఉంటాయో వాటిని గుర్తించి ఒక్కొకటి అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలిపారు. కాళేశ్వరం నీరు గతంలో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల తో పాటు కోదాడ కొంతమంది బాగానికి నీరు ఇచ్చి రైతులను ఆదుకున్నామని రైతులు ఇబ్బంది పడుతున్నారని నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించి రైతులను ఆదుకోవాలని అన్నారు. విడుదల చేసిన నాలుగు పథకాలు అర్హులైన అందరికీ ఇవ్వాలని, ఎవరికైనా రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి... మాట్లాడుతూ ప్రజలందరి ఆశీర్వాదం తో 13 నెలల క్రితం అధికారంలోకి వచ్చి నేడు ఒకే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు పథకాలు ప్రారంభించటం శుభపరిణామం అని,ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ లు అమలు చేస్తున్నామని తెలిపారు. పేదవానికి పదేండ్ల క్రితం పక్కా ఇళ్లు నిర్మించామని మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం లో ఇళ్ళు కట్టుకునే ప్రతి పేదవానికి రూ.5 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు అనే నాలుగు పథకాలు అమలు చేస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ప్రజాపాలన గ్రామ సభలో సంక్షేమ పథకాల జాబితా లో పేరు లేకపోతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆ జాబితా ప్రజాపాలన, కుల గణన, మీ సేవలో దరఖాస్తు చేసుకున్న పేర్లు మాత్రమే చివరి జాబితా కాదు అని రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు లాంటి పథకాలకి దరఖాస్తు నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ అన్నారు.