ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలి

by Naveena |
ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ, నడిగూడెం: ప్రభుత్వం కళాశాలల్లో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు పేద విద్యార్థుల కోసం సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని నడిగూడెం కేఎల్ ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ నాయక్ పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి అధ్యాపకులు బుధవారం ముందస్తు ప్రచార నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలు రాయనున్న మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,కస్తూరిబా పాఠశాల, ఉర్లుగొండ, మామిళ్లగూడెం జెడ్పి ఉన్నత పాఠశాలలో ముందస్తు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మహేష్, కృష్ణ, ఉపేందర్, నాగరాజు, ఈశ్వర్, రవి వర్మ పాల్గొన్నారు.ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలి



Next Story

Most Viewed