Suryapet Collector : అన్ని వర్గాల నుంచి విస్తృత అభిప్రాయాల స్వీకరణ

by Aamani |
Suryapet Collector : అన్ని వర్గాల నుంచి విస్తృత అభిప్రాయాల స్వీకరణ
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన రెవెన్యూ చట్టం ఆర్వోఆర్ – 2024 ముసాయిదా అమలు పై శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో చర్చ వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం ప్రకటనలో తెలిపారు. అన్ని వర్గాల నుండి విస్తృత అభిప్రాయాలు స్వీకరించాలనే లక్ష్యంతో చర్చ కార్యక్రమం నిర్వహణ ఉదయం 11:00 గం॥చేపట్టనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిదులు, న్యాయవాదులు,సీనియర్ పాత్రికేయులు, విద్యావేత్తలు, రైతులు, మేధావులు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు, ఇతర శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చ వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం అమలుకు ఆయా వర్గాల నుంచి తగు సలహాలు, సూచనలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్చ వేదికకు హాజరై సలహాలు, సూచనలు అందజేయాలని సూచించారు.



Next Story