ఆంధ్ర నుంచి తెలంగాణకు గంజాయి సరఫరా

by Kalyani |
ఆంధ్ర నుంచి తెలంగాణకు గంజాయి సరఫరా
X

దిశ, చింతలపాలెం : ఆంధ్ర నుంచి తెలంగాణకు నిషేధిత గంజాయిని సరఫరా చేస్తూ పట్టుబడిన మహిళపై పలు శిక్షణ కింద కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ ఏ సైదిరెడ్డి అన్నారు. పూర్తి వివరాల్లోకెళితే ఆంధ్ర ప్రాంతంలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరపు పాడు తండా కు చెందిన గుగులోతు విజయ దినసరి కూలీ,తాను తన స్నేహితుల ద్వారా గంజాయి తాగడం అలవాటు చేసుకుని, ఆ మత్తు పదార్థానికి బానిస గా మారింది.

సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి, సరిహద్దు ఆంధ్ర ప్రాంతం నుంచి ఆటోలలో ప్రయాణించి తెలంగాణ ప్రాంతం మేళ్లచెరువు మై హోమ్ సిమెంట్స్ వద్ద ఫ్యాక్టరీ కూలీలకు ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది. ఎప్పటిలాగే దుర్గా అనే మహిళ దగ్గర నుంచి గంజాయి కొనుగోలు చేసి అమ్మడానికి వస్తున్న మహిళను పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు చింతలపాలెం వద్ద ఆటోలో ప్రయాణం చేస్తున్న మహిళను విచారించగా 200 గ్రాముల గంజాయి దొరికింది. ఆమెపై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ సైదిరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు.



Next Story

Most Viewed