Suicide attempt : కలెక్టరేట్ లో మహిళల ఆత్మహత్యాయత్నం...

by Kalyani |
Suicide attempt : కలెక్టరేట్ లో మహిళల ఆత్మహత్యాయత్నం...
X

దిశ, సూర్యాపేట : వంశ పారంపర్యంగా వచ్చిన తమ భూమిని ఇతరులు కబ్జా చేశారని, దీనిపై రెవెన్యూ కార్యాలయం చుట్టూ గత కొన్నేళ్లుగా తిరుగుచున్నపటికి తమకు న్యాయం జరగడం లేదని సోమవారం కలెక్టరేట్ లో ముగ్గురు మహిళలు పెట్రోల్ పోసుకున్నారు. కలెక్టరేట్ లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వారు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి ముందే తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ని ముగ్గురు మహిళలు పోసుకునే క్రమంలో అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామనికి చెందిన ఎస్టీ మహిళ మేడం అరుణ తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు.

వారి తాతల పేరున మొత్తం 10 ఎకరాల భూమి ఉందని, అందులో 2 ఎకరాల 20 గుంటల భూమి సర్వేనెంబర్ 190/24 లో పహానీ ఉండగా అది కూడా మా పక్కనే ఉన్న వ్యక్తులు మొత్తం కబ్జా చేసి మమ్మల్ని మా భూమిలోకి రానివ్వడం లేదని వాపోయారు. తామూ పొట్టకూటి కోసం ఊరు వదిలి వెళ్లి వచ్చే సరికి తమ భూమి లేదని కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై గతంలో స్థానిక ఎమ్మార్వో ను కలిసినప్పటి ఫలితం లేకపోయిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన అవుట నాగయ్య అనే రైతు గత కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తి తన భూమిని బలవంతంగా లాక్కొని సర్వే నంబర్ 836 లో గల 2 ఎకరాల 11 గంటల భూమిలో బోర్డు పెట్టి తనను ఆ భూమిలోకి రానివ్వడం లేదని వాపోతూ తన వెంట తెచ్చుకున్న మందు డబ్బాను తీయబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అంతే కాకుండా తరచూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed