- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తాగునీటి కోసం తండ్లాట...

దిశ, నాగార్జునసాగర్: కృష్ణమ్మ చెంత ఉన్న ఈ ఏడాది దాహం కేకలు తప్పేలా లేవు. నందికొండలో నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లోని పైలాన్ కాలనీ తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటిని సరఫరా చేసే ఫిల్టర్ హౌస్లో గత వారంరోజులుగా మోటర్లు చెడిపోవడంతో కాలనీలకు నీళ్లు రాక స్థానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తాగునీటి తో పాటు కాలకృత్యాలు తీర్చుకొనేందుకు కనీస నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నది తీరాన ఉన్న కనీసం తాగునీరు కూడా రాకుంటే.. రానున్న రోజుల్లో ఎలా బతకాలని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగార్జునసాగర్లో ఉన్న కాలనీలోని ఇళ్లకు కనీసం తాగునీరు సరఫరా చేయకుండా 150కిలో మీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్కు తాగునీటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నీటిని తరలిస్తున్నారని వాపోయారు.బట్టలు ఉతుక్కోవడానికి, స్నానం చేయడానికి నీరు లేక ఓ పక్క అవస్థలు పడుతుంటే మరోపక్క దాహం తీర్చుకోవడానికి బిందెడు నీళ్లు కూడా అందడం లేదని మహిళలు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి మంచినీటి కష్టాలతో కన్నీరు కారుస్తున్న దయ తలిచే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.