Collector: రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు

by Kalyani |
Collector: రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లాలోని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇద్దరు తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులను సస్పెన్షన్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోదాడ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సాయిరాం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పి. సుజిత్ పై రైతుల నుండి పలు ఆరోపణలు రావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోదాడ ఆర్డివో ను విచారణకు ఆదేశించారు.

విచారణలో వాస్తవాలు నిజమేనని తేలడంతో కోదాడ తహసీల్దార్ సాయి రాంను బదిలీ చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుజిత్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో పరిపాలన విభాగంలో డిప్యుటేషన్ పై పని చేస్తున్న నాగారం తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ షఫీ ఉద్యోగుల నుంచి పలు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విచారణలో వాస్తవాలు రుజువు కావడంతో సదరు ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.



Next Story

Most Viewed