శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు : ఎస్సై

by Kalyani |
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు : ఎస్సై
X

దిశ, నడిగూడెం: అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని, చట్టాలను చేతుల్లోకి తీసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై జి అజయ్ కుమార్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు సోమవారం నడిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రిపురారం గ్రామంలో పోలీస్ కళాజాత బృందంతో సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై అజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులు నకిలీ విత్తనాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు, ఎరువులు, విత్తనాలు కొనుగోలు సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దళారులను నమ్మి ఎవరు మోసపోవద్దని, వ్యాపారుల ఎవరైనా నకిలీ విత్తనాలను విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో మూఢనమ్మకాలను నమ్మొద్దన్నారు. సైబర్ నేరగాళ్ల మాయలో పడి వ్యక్తిగత వివరాలను, బ్యాంకు ఖాతా, ఏటీఎం, ఓటీపీ వివరాలను తెలుపవద్దని పేర్కొన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని, వేధింపులు, అత్యవసర సమయాల్లో 100 కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వీరబాబు, ప్రతాపరెడ్డి, కళాబృందం ఇన్ చార్జ్ యల్లయ్య,గోపి, కృష్ణ, చారి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed