నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వకు నీటి విడుదల నిలిపివేత

by Kalyani |
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వకు  నీటి విడుదల నిలిపివేత
X

దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వకు ఆదివారం రాత్రి నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోకి వచ్చే నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ నెల 1 నుంచి నీటిని విడుదల చేశారు. రోజుకు సుమారు 4,500 క్యూసెక్కుల నీరు విడుదలైంది. వారం రోజుల్లో 2.23 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ఆదివారం 511.20 అడుగులుగా ఉంది. సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 1350 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా, ఎగువ నుంచి ఎటువంటి నీరు రాలేదని అధికారలు తెలిపారు.



Next Story

Most Viewed