- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సూర్యాపేట జిల్లాకు తగ్గిన ఎస్సారెస్పీ జలాలు

దిశ,తుంగతుర్తి: సూర్యాపేట జిల్లాకు కాలువల ద్వారా వస్తున్న శ్రీరామ్ సాగర్ రెండో దశ (ఎస్సారెస్పీ) జలాల సామర్థ్యం ఆదివారం తగ్గింది.ఉదయం 8 గంటలకు ఒక వేయి 429 క్యూసెక్కుల జలాలను మాత్రమే అధికారులు వదిలారు.ఎందుకంటే పై స్థాయిలో నీళ్ల రాక తగ్గడమే దీనికి ప్రధాన కారణం.ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి సూర్యాపేట జిల్లాకు నీళ్లను విడుదల చేసే కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి శనివారం వరకు ఒక వేయి 333 క్యూసెక్కుల నీళ్లు రాగా ప్రస్తుతం తగ్గి కేవలం ఒక వెయ్యి 168 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే వెళుతున్నాయి.
అలాగే బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో కూడా నిల్వ నీటిమట్టం తగ్గింది.0.480 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 0.424 టీఎంసీల నీళ్ళే ఉన్నాయి.జిల్లాకు వచ్చిన జలాలు షెడ్యూల్ ప్రకారం గత నెల 24తో పూర్తిస్థాయిలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే రైతాంగం విజ్ఞప్తి మేరకు చేతికొచ్చిన పంటలను కాపాడడానికి అధికారులు మరో మారు నీళ్లను విడుదల చేశారు. ఈ నెల 2 నుంచి కాలువల ద్వారా ద్వారా సూర్యాపేట జిల్లాకు నీళ్లు వస్తున్నాయి. అయితే నీటి విడుదల ఎన్ని రోజులు జరిగే విషయంపై అధికారుల నుంచి స్పష్టత లేదు.