- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పన్ను వసూళ్ల పై ఫోకస్..

దిశ, కోదాడ : మున్సిపాలిటీల్లో నిర్దేశించిన స్థాయిలో పన్నులు వసూలు కాకపోవడంతో నిధుల కొరత వెంటాడుతున్నది. కొత్త కాలనీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు నిధులు సరిపోవడం లేదు. దీంతో పన్నుల వసూలు కోసం అధికారులు ఆయా మున్సిపాలిటీల్లో నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. ట్యాక్స్ చెల్లించని వారికి మున్సిపాలిటీల నుంచి అందుతున్న తాగునీరు, పారిశుధ్యం వంటి సర్వీసులను నిలిపేయాలని భావిస్తున్నారు.
నిధులు లేక అభివృద్ధి పనులకు ఆటంకం..
ప్రతి మున్సిపాలిటీల్లోనూ వసూలవుతున్న కొద్దిపాటి నిధులతో ఉద్యోగుల జీతభత్యాలు, విద్యుత్ చార్జీల చెల్లింపునకే సరిపోతున్నదని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో మున్సిపాలిటీకి జీతభత్యాల రూపంలో ప్రతి నెలా రూ.30 నుంచి రూ. 40 లక్షల వరకు ఖర్చు అవుతున్నది. తాగునీరు, పారిశుధ్య పనులకు ఉపయోగించే వాహనాల డీజిల్ ఖర్చు, ఇతరత్రా ఖర్చులు కలిపి మొత్తం ఒక్కో మున్సిపాలిటీకీ నెలకు రూ.కోటి వరకు వెచ్చించాల్సి వస్తున్నది. దీంతో పన్నుల ద్వారా వస్తున్న నిధులు పై వాటికి సరిపోతుండడంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత వెంటాడుతున్నది. నగర శివారులోని అనేక మున్సిపాలిటీల్లో కొత్త కాలనీల ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నది. పెరుగుతున్న కొత్త కాలనీలకు రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను కల్పించేందుకు నిధులు సరిపోవడం లేదు.
50 శాతమే వసూలు..
ఈ ఏడాదిలో ఇప్పటివరకు జిల్లాలో 50 శాతమే పన్నులు వసూలయ్యాయి. ఒక్కో మున్సిపాలిటీ నుంచి సుమారుగా రూ. ఐదు నుంచి రూ. ఆరు కోట్ల వరకు పన్నులు రావాల్సి ఉండగా అందులో సగమే వసూలయ్యాయి. నిర్దేశించిన పన్నులతో పాటు బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. కోదాడ పట్టణంలో 7.71 కోట్ల వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 4.28 కోట్ల మాత్రమే వసూలు కాగా ఇంకా 3.43 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉన్నాయి. మొండి బకాయిలను కట్టని వారికి రెడ్ నోటీసుల సైతం జారీ చేశారు. స్కీం స్పెషల్ ప్రోగ్రాం ఉండడంతో ప్రజలు ఎన్ఆర్ఎస్ కట్టడం వలన కొంచెం పనులు వసూలు కావటం లేదని, ఉద్యోగస్తులకు ఐటీ ఉండడంతో మార్చి చివరిలోగా కడతారని మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. పన్నులు వసూలు చేసేందుకు కోదాడ పట్టణ వ్యాప్తంగా తొమ్మిది టీంలను ఏర్పాటు చేశారు.
బృందాలుగా బకాయిదారుల వద్దకు..
జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసేందుకు శనివారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఒక్కో మున్సిపాలిటీలో మూడు నుంచి నాలుగు బృందాల సభ్యులు.. బకాయిదారుల వద్దకు వెళ్లనున్నారు. బకాయిలు చెల్లించని వారికి మున్సిపాలిటీల నుంచి అందే తాగునీరు, పారిశుధ్యం తదితర సౌకర్యాలను నిలిపివేయాలని నిర్ణయించారు.
మొండి బకాయిలను వసూలు చేయనున్నాం.. కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి..
పన్నులు వసూలు కాకపోవడంతో మున్సిపాలిటీల్లో నిధుల కటకట ఏర్పడింది. ట్యాక్స్ వసూలు కోసం నేటి నుంచి మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మొండి బకాయిలను వసూలు చేయనున్నాం. పన్నులు చెల్లించని వారి ఇండ్లకు తాగునీరు కలెక్షన్ తొలగించడంతో పాటు చెత్తసేకరణ ట్రాక్టర్లనూ బంద్ చేస్తాం. ప్రజలు మున్సిపాలిటీల్లో పన్నుల చెల్లించి అభివృద్ధికి సహకరించాలి.