ఆరుగురు గురుకులం విద్యార్థులు మిస్సింగ్.. అసలేం జరిగింది..

by Sumithra |
ఆరుగురు గురుకులం విద్యార్థులు మిస్సింగ్.. అసలేం జరిగింది..
X

దిశ, కోదాడ : కోదాడ మండలం మునగాల నెమలిపురి ఆర్ఆర్ & ఆర్ సెంటర్లో నడుపుతున్న గురుకుల పాఠశాల నుండి పదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఉదయం నుంచి మిస్సింగ్ లో ఉన్నారు. ఉదయం 11 గంటల నుండి విద్యార్థులు కనపడకపోయిడంతో సాయంత్రం ఏడు గంటలకు విద్యార్థులు తల్లిదండ్రులకు ఈ విషయాన్ని ఫోన్ ద్వారా ఉపాధ్యాయులు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాల వద్దకు వచ్చి ప్రిన్సిపల్ అడగగా తమకు తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

రాత్రి 10:00 వరకు కూడా విద్యార్థులు రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ చేస్తుండగా విద్యార్థులు తలుపులు కొడుతున్న నేపథ్యంలో టీచర్ మందలించడంతోనే ఆదివారం ఉదయం బయటకు వెళ్లినట్లుగా తోటి విద్యార్థులు చెబుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. టీచర్ మందలించడంతోనే బయటకు వెళ్లారా లేక ఇతర కారణాలవల్ల ఏమైనా బయటికి వెళ్లారా అనేది అర్థం కాని పరిస్థితి. విద్యార్థులు కనపడకపోవడంతో తల్లిదండ్రులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.



Next Story