- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గంజాయి కేసులో ఆరుగురు నిందితులు అరెస్ట్..

దిశ, హుజూర్ నగర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరకు లోయ నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకువచ్చి అమ్ముతున్న ఆరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద 235 గ్రాముల గంజాయి, 6 సెల్ ఫోన్లు ఒక బెలినో కార్ వాహనాన్ని స్వాధీనపరచుకొని, వారిపై కేసులు నమోదు చేసినట్లు హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ చరమందరాజు మంగళవారం విలేకరులకు తెలిపారు. సి ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఆరుగురు వ్యక్తులైన వీరమల్ల ఉపేందర్ ,షేక్ రజి ఆఫ్రోజ్ ,షేక్ యాసిర్ ,బత్తిని ఉమేష్ ,మీసాల గోపి ,చిల్ల వికాస్ వీరందరూ మంచి స్నేహితులు. వీరికి గంజాయి తాగడం తోపాటు గంజాయి అమ్ముతుంటారు.
గత నెల 25న వీరమల్ల ఉపేందర్, షిక్ రజి ఆఫ్రోజ్, మీసాల గోపి, చిల్ల వికాస్, సయ్యద్ రహమద్ బాబా @ సొహైల్, షేక్ బాల సైదా @ తుఫాన్ సైదా అనే వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరకు లోయ నుంచి గంజాయి కొనుగోలు చేద్దామని చెప్పి, షేక్ రిజి ఆఫ్రోజ్ తనకు తెలిసిన నూకపంగు రాజు చెందిన TS08HM9251 నెంబర్ గల బెలినో కార్ సెల్ఫ్ డ్రైవ్ నిమిత్తం కిరాయి తీసుకొని అరకు లోయకు వెళ్లారన్నారు. అక్కడ ఉపేందర్, చిల్ల వికాస్, షేక్ రజి ఆఫ్రోజ్, సయ్యద్ రహమద్ బాబా @ సోహైల్ లు తాల కొన్ని డబ్బులు వేసుకొని 20,000/-రూపాయలు ఇచ్చి ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద 5 కేజీల గంజాయి కొనుగోలు చేసుకొని గత నెల 27 హుజూర్ నగర్ కు వచ్చారని తెలిపారు.
సయ్యద్ రహమద్ బాబా @ సొహైల్ అనే వ్యక్తి ఉపేందర్, చిల్ల వికాస్, షేక్ రజి అఫ్రోజ్ లకు కొంత గంజాయి ఇచ్చి, మిగతా గంజాయి అంతా తన వద్దే ఉంచుకొని ఆ గంజాయిని అమ్మి డబ్బులు ఇస్తానని చెప్పగా ఆఫ్రోజ్, ఉపేందర్, చిల్ల వికాస్, మీసాల గోపీలు సరేనని చెప్పి, వారి వద్ద ఉన్న గంజాయిలో నుండి కొంత త్రాగి, మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితులైన హుజూర్ నగర్ పట్టణానికి చెందిన షేక్ యాసిర్, బత్తిని ఉమేష్ లకు లింగగిరి రోడ్ వైపున గల కాటమయ్య గుడి వెనుకల గంజాయి అమ్ముతుండగా హుజూర్ నగర్ ఎస్సై తన సిబ్బందితో వెళ్లి ఆరుగురు వ్యక్తులను పట్టుకొని అరెస్టు చేసి 235 గ్రాముల గంజాయి, 6 సెల్ ఫోన్ లు ఒక బేలనో వాహనాన్ని స్వాధీనపరచుకొని, వారిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ పూర్తి చేసి నేరస్తులను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
.