- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కుట్టు శిక్షణ కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి..

దిశ,రాజపేట: యువతులు, మహిళలు కుట్టు శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆరుట్ల ఫౌండేషన్ చైర్మన్ ఆరుట్ల సుశీల దేవి అన్నారు. శుక్రవారం రాజపేట మండలం బేగంపేట గ్రామంలో మహిళలు, యువతకు టైలరింగ్ నేర్చుకోవడానికి కుట్టు శిక్షణ కేంద్రం ఆరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో ప్రారంభించి మాట్లాడారు. యువతులు ఈ కుట్టు శిక్షణ కేంద్రం లో నేర్చుకున్న వారికి స్వామి రామానంద ట్రస్టు ద్వారా సర్టిఫికెట్లు కూడా పంపిణీ చేస్తామని అన్నారు. అలాగే గ్రామంలో గల వృద్ధులకు ఆసరాగా చేతి కర్రలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకులు కొల్లూరి రాజయ్య, మండల కార్యదర్శి చిగుళ్ల లింగం మాట్లాడుతూ..ఈ ప్రాంతంలో ఆరుట్ల రామచంద్రారెడ్డితో పని చేసినటువంటి చరిత్ర ఈ గ్రామానికి ఉన్నదని అన్నారు. ఆనాడు భూ పంపకం చేయడంలో శిస్తు తొలగించడంలో బద్దం నరసింహారెడ్డి, మూల బాలయ్య, బలిజ వీరయ్య, జిట్ట రామచంద్రారెడ్డి, చిగురుల మల్లయ్య వీరందరూ ఆరుట్ల రామచంద్రారెడ్డి తో పని చేసినటువంటి చరిత్ర ఈ గ్రామానికి ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్, గ్రామ కార్యదర్శి మూల హరినాథ్, బాబుపేట వెంకటయ్య, మూల పోచయ్య, వెంకటయ్య, రైతు సంఘం మండల నాయకుడు ఉగ్గు కరుణాకరు, జంగం శ్రీశైలం, శివప్రసాద్ తదితరులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.