సోమప్ప జాతర నిధుల మంజూరు పై మంత్రి దృష్టి సారించేనా..!?

by Sumithra |
సోమప్ప జాతర నిధుల మంజూరు పై మంత్రి దృష్టి సారించేనా..!?
X

దిశ, నేరేడుచర్ల : కాకతీయ కాలం నాటి పురాతన చారిత్రాత్మక దేవాలయాలలో ఒకటిగా పేరొందిన హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని నేరేడుచర్ల మండలంలోని సోమారం - బూర్గుల తండా గ్రామ శివారులోని మూసీ నది ఒడ్డున వెలిసిన స్వయంభు సోమేశ్వర సోమప్ప బృమాలిక దేవాలయం ఉంది. ఈ పురాతనమైన దేవాలయం నల్గొండ సూర్యాపేట జిల్లాల సరిహద్దుల్లో ఉండడంతో రెండు జిల్లాలకు సంబంధించిన భక్తులు వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ దేవాలయం చిన్నదైనప్పటికీ దీని ప్రాముఖ్యత విశిష్టత చాలా గొప్పదిగా ఉన్నది. ఈ దేవాలయానికి ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పూజలు, అభిషేకాలు, నవగ్రహ పూజలు చేయించుకుని వెళ్తుంటారు. దీనికి ఎండోమెంట్ కింద ఈ దేవాలయం ఉంది. దీనికి పాలకవర్గంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సరైన నిధులను ప్రభుత్వం కేటాయించకపోవడంతో డెవలప్మెంట్ కు నోచుకోని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడికి వచ్చే భక్తులే చందాల రూపంలో డబ్బులు ఇస్తే వాటిని జమ చేసి దేవాలయాన్ని ఇప్పటికి కొంతమేర డెవలప్మెంట్ చేశారు.

మంత్రి ఉత్తమ్ సహకారం కోసం పాలకవర్గం ఎదురు చూపులు..

స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర నీటిపారుదల & పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో పెద్దగట్టు జాతరకు 5 కోట్లను మంజూరు చేయగా అలాగే మహా శివరాత్రి సందర్భంగా మేళ్లచెరువు జాతరకు ఏర్పాట్లకు కోటి రూపాయలను ప్రకటించారు. అయితే మహాశివరాత్రి సందర్భంగా సోమప్ప జాతరలో కూడా బాగా ఘనంగా నిర్వహించేందుకు పాలకవర్గం సుముఖంగా ఉన్నప్పటికీ నిధులు లేకపోవడంతో ఎలా జరపాలో అర్థంకాక సతమతం అవుతున్నారు. సోమప్ప జాతర కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవచూపి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

ఈ నెల 24 నుంచి మార్చి ఒకటి వరకు జాతర..

మహాశివరాత్రి సందర్భంగా సోమప్ప జాతరను ఈ నెల 24 నుండి మార్చి ఒకటి వరకు నిర్వహించేందుకు పాలకవర్గంతో పాటు ఎండోమెంట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కానీ వీరికి ప్రభుత్వం నుండి ఎటువంటి బడ్జెట్ రాకపోవడంతో ఎలా జాతర నిర్వహించాలనే అనే సందిగ్ధత ఏర్పడింది. గతంలో మాదిరిగానే భక్తుల వద్ద చందాలు వసూలు చేసి జరిపే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం లో గతంలో పాలకవర్గం ఎండోమెంట్ కిందకు దేవాలయం వెళ్లిందని అప్పటినుండే కొంత డెవలప్మెంట్ జరుగుతుందని ఇప్పుడు ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ చూపి నిధులు మంజూరు చేస్తే జాతరను ఘనంగా నిర్వహించుకోవచ్చునని భక్తులు ఆశాభావం చేస్తున్నారు.



Next Story

Most Viewed