- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఓకే టీచర్.. ఇద్దరు విద్యార్ధులు..

దిశ, అనంతగిరి : ప్రైవేటు పాఠశాలలు ప్రతి గ్రామంలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దాంతో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ను తీర్చి దిద్దుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఈ మార్పు కనిపించడం లేదు. ప్రైవేటు స్కూళ్లలో అయితేనే విద్య బాగుంటుందని పిల్లల తల్లిదండ్రులు భ్రమలో ఉన్నారు. దాంతో ఖర్చు ఎక్కువగా ఉన్నా ఇతర అవసరాలను సర్దుకుంటూ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు.
ఇక అనంతగిరి మండలం ఖానాపురం ఆవాస గ్రామమైన అజ్మీర తండా..
ప్రభుత్వ పాఠశాల కథే వేరు. గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. అందులో ఒకే టీచర్ ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఐదుగురిలో కూడా కేవలం ఇద్దరే హాజరవుతున్నారు. గతంలో ఈ పాఠశాలలో గిరిజన విద్యార్థులు చాలా మంది విద్యను అభ్యసించేవారు. కానీ గతంలో ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి పాఠశాలకు సక్రమంగా హాజరు కాకపోవడంతో, విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. విద్య కూడా అంతంత మాత్రం ఉండటంతో గ్రామంలోని తల్లిదండ్రులు ప్రైవేటు వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు కూడా డిప్యూటేషన్ మీద వచ్చారు. ఈ సారి నూతన జాయినింగ్ లో విద్యార్థుల సంఖ్య పెరగకుంటే ఈ ప్రభుత్వ పాఠశాలను రద్దుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఇక్కడ ఉపాధ్యాయుడు పని చేయాలంటే మాత్రం నరకం అనుభవించాల్సిందే. కారణం ఈ గ్రామానికి వచ్చే రహదారి. ఖానాపురం నుండి అజ్మీర తండా వరకు మట్టి రోడ్డు గుంతలు గుంతలుగా ఉంటుంది. దీంతో ఉపాధ్యాయులు ఈ రహదారి గుండా పాఠశాలకు రావాలంటే నరకం అనుభవించేవారు. ఈ కారణంతోనే మండల విద్యాధికారుల సైతం అజ్మీర్ తండాకు ఎక్కువగా ఇన్స్పెక్షన్ కి వచ్చేవారు కాదని దీంతోటే ఉపాధ్యాయులు నిర్లక్ష్యం గా ఉండేవారని ఈ కారణం చేతే విద్యార్థుల సంఖ్య తగ్గిందని ప్రజలు పేర్కొంటున్నారు.