మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి

by Naresh |
మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
X

దిశ, హుజుర్ నగర్: మున్సిపాలిటీలలో ప్రతిరోజు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని పచ్చదనంతో మున్సిపాలిటీ కళకళలాడే విధంగా తీర్చిదిద్దాలని లోకల్ బాడీ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ప్రియాంక అన్నారు. బుధవారం హుజూర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహించారు .సందర్భంగా ఆమె మాట్లాడారు . వెంచర్లలో మున్సిపాలిటీ కేటాయించిన మున్సిపాలిటీలోని లేఅవుట్, ప్రభుత్వ స్థలాల్లో నర్సరీలను, మొక్కలను పెంచాలని అధికారులు ఆదేశించారు. మున్సిపాలిటీ 2024 -25 ఆర్థిక సంవత్సరం సంబంధించిన బడ్జెట్‌ను మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లీ రవి అర్చన ఆధ్వర్యంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మున్సిపాలిటీకి ప్రభుత్వ నిధులు, డిపాజిట్లు మార్కెట్, లైసెన్స్ ఇతర ఫీజులు, ఇతరత్రా ఆదాయం మొత్తం రూ. 21. 45 కోట్లు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దానిలో సాధారణ పరిపాలన, సిబ్బంది జీత బత్యాలు, గ్రీన్ బడ్జెట్ తదితర ఖర్చుల కోసం రూ 21.45 కోట్లు అంచనా బడ్జెట్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి, కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి, కస్తాల శ్రవణ్, రాజా 'నాయక్, సతీష్, ఫణికుమార్, త్రివేణి, ఆస్మా, రామ్ గోపి, కొమ్ము శ్రీను, మేనేజర్ యాకుబ్ పాషా, అకౌంటెంట్ హామీద్ బాబా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed